Site icon NTV Telugu

Medigadda Barrage: మేడిగడ్డ బ్యారేజీకి జియోట్యూబ్ కట్ట.. మరమ్మత్తుల్లో కొత్త సమస్య..

Medigadda Barrage

Medigadda Barrage

Medigadda Barrage: మేడిగడ్డ బ్యారేజీకి ప్రమాదం ఉన్నందున ఈ వర్షాకాలంలోనే అన్ని గేట్లను తెరవాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు ఆదేశించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం గోదావరి నీటిని ఎత్తిపోసేందుకు ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించింది. దీంతో మేడిగడ్డ ఎగువన జియోట్యూబ్, జియోబ్యాగ్స్ తో కట్ట నిర్మించాలని నీటిపారుదల శాఖ తెలిపింది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను వేగవంతం చేశారు. ఈ క్రమంలో శుక్రవారం జలసౌధలో ఈఎన్సీ అనిల్ కుమార్ నేతృత్వంలో జరిగిన బోర్డు ఆఫ్ సీఈ సమావేశంలో జియోట్యూబ్స్ తయారీదారు వీరేంద్ర టెక్స్ టైల్స్ ప్రదర్శన ఇచ్చారు. సాంప్రదాయ పద్ధతులతో పోలిస్తే జియోట్యూబ్ టెక్నాలజీ ఖర్చుతో కూడుకున్నది, సమర్థవంతమైనదని కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. వీటితో మేడిగడ్డ బ్యారేజీకి ఎగువన తాత్కాలిక ఆనకట్ట నిర్మించి పంపింగ్ కొనసాగించవచ్చని స్పష్టం చేశారు.

Read also: బిర్యానీ అసలు పేరేంటో ఎప్పుడైనా ఆలోచించారా?

మరోవైపు మేడిగడ్డ బ్యారేజీ తాత్కాలిక మరమ్మతుల్లో కొత్త సమస్యలు తలెత్తుతున్నాయి. దిగువ భాగంలో భారీ గొయ్యి ఏర్పడి 25 వేలకు పైగా ఇసుక బస్తాలతో పూడ్చిపెట్టారు. ఇటీవల ఏడో బ్లాక్ వద్ద ప్రాంతమంతా శుభ్రం చేస్తుండగా మరో భారీ కుప్ప కనిపించగా, కొన్ని చిన్నవి పూడ్చిపెట్టబడ్డాయి. మరోవైపు బ్యారేజీ నిర్మాణానికి ముందు నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించిన జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్.ఐ) అధికారులు ఇచ్చిన విచారణ నివేదిక అందుబాటులో లేని విషయం తెలిసిందే. అసలు జీఎస్‌ఐతో సర్వే చేశారా లేదా అన్న విషయంపై కూడా స్పష్టత లేదు. కీలకమైన ఈ నివేదిక జీఎస్‌ఐ వద్ద ఉంటే దానిని పొందేందుకు ప్రయత్నిస్తామని నీటిపారుదల శాఖ వర్గాలు తెలిపాయి. వర్షాకాలంలో అన్ని గేట్లను తెరిచి ఉంచాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డిఎస్‌ఎ) సూచించగా, 8 గేట్లను ఎత్తడం సమస్యగా మారినట్లు తెలుస్తోంది. పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాతే ఎలాంటి సమస్యలు ఉన్నాయి.. ఏం చేయాలనే దానిపై ఓ అంచనాకు వచ్చే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.
PM Modi: ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఐదేళ్లలో ఐదుగురు ప్రధానులు..?

Exit mobile version