NTV Telugu Site icon

Dr Laxman: బీజేపీ అభ్యర్థుల ఎంపికలో సామాజిక న్యాయం.. బీసీలకు 20 పైగా సీట్లు..

Dr Lakshman

Dr Lakshman

Dr Laxman: అభ్యర్థుల ఎంపికలో బీజేపీ సామాజిక న్యాయం పాటిస్తుందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. మూడు రాష్ట్రాల అభ్యర్థుల ఎంపిక పై బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ చర్చించిందని అన్నారు. తెలంగాణ నుంచి 50 పైగా స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక కసరత్తు పూర్తి చేసి కేంద్ర ఎన్నికల కమిటీకి అందించామన్నారు. ఏక్షణంలో అయినా అభ్యర్థుల ప్రకటన ఉంటుందన్నారు. అభ్యర్థుల ఎంపికలో బీజేపీ సామాజిక న్యాయం పాటిస్తుందని స్పష్టం చేశారు. సీట్ల కేటాయింపులో మహిళలు,బిసిలకు పెద్ద పీట వేసిన ఘనత బీజేపీకి దక్కుతుందన్నారు. మహిళలకు సీట్ల విషయంలో బీఆర్ఎస్ మొసలి కన్నీరు కారుస్తుందని కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో కవిత ధర్నాలు చేసింది కానీ.. మహిళలకు సీట్లు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటి విడతలో బీసీలకు 20 పైగా సీట్లు కేటాయిస్తున్నామన్నారు.

కాంగ్రెస్ ,బీఆర్ఎస్ లు బీసీలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ బీసీల సేవలు వాడుకుని వదిలేస్తున్నారని తెలిపారు. బీసీ సమాజం బీజేపీ వైపు చూస్తోందన్నారు. బీసీలకు పెద్దపీట వేస్తున్న పార్టీ బీజేపీనే అన్నారు. బీసీల కోసం అనేక సంక్షేమ పథకాలను బీజేపీ అమలు చేస్తోందన్నారు. కాంగ్రెస్ ,బీఆర్ఎస్ బీసీలను బానిసలుగా చూస్తున్నారని తెలిపారు. బీసీలకు బీజేపీ అవకాశం కల్పిస్తుందన్నారు. రాజా సింగ్ సస్పెన్షన్ పోటీ అంశాన్ని అధిష్టానం పరిశీలిస్తోందన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ కంటే ఎక్కువ స్థానాలు బీసీలకు బీజేపీ కేటాయిస్తుందని అన్నారు. ప్రధాని మోడీ సహా కేంద్రమంత్రులు, బీజేపీ కీలక నేతలు తెలంగాణ ఎన్నికల ప్రచారాల్లో పాల్గొంటారని తెలిపారు.
Tammy Hurricane: భారీ వర్ష సూచన.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణ శాఖ