Site icon NTV Telugu

హుజూరాబాద్ ప్రజలు ఉద్యమాన్ని గెలిపించారు : విజయ శాంతి

హుజూరాబాద్ ప్రజలు కేసీఆర్ ని ఎడమ కాలు చెప్పుతో కొట్టారు. నీ డబ్బులు పని చెయ్యవని బుద్ధి చెప్పారు అంటూ బీజేపీ నేత విజయ శాంతి కామెంట్స్ చేసారు. డబ్బుతో కాదు , ఉద్యమం తో సీఎం వి అయ్యావు. హుజూరాబాద్ ప్రజలు ఉద్యమాన్ని గెలిపించారు. బీజేపీ ప్రత్యామ్నాయం అని చెప్పారు అక్కడి ప్రజలు.. ఉద్యమం చెయ్యమని చెప్పారు. బీజేపీ టీమ్ వర్క్ గా పని చెయ్యాలి.. మాలో స్ప్లిట్ లేదని.. తెరాస, కాంగ్రెస్ లెక్క కాదని చెప్పాలి. ఫార్మ్ హౌస్ సీఎం గారు ఇప్పటికైనా మారండి. భయం తోనే హుజూరా బాద్ ప్రచారానికి రాలేదు. మిమ్మల్ని విమర్శించాలి అంటే భయ పడే వారు… ఇప్పుడు నిన్ను ఎన్ని అన్న ప్రజలు ఏమనడం లేదు. కేసీఆర్ ఎన్ని రోజులు బతుకతావో తెలియదు… డబ్బులు ఏమి చేసుకుంటావు. కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా ఉంది… డిపాజిట్ కూడా రాలేదు… మూతి పగల గొట్టారు అని పేర్కొన్నారు.

Exit mobile version