Bihar Congress: హైదరాబాద్ లో బీహార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల షాపింగ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bihar Congress: జార్ఖండ్ ఎమ్మెల్యేలు హైదరాబాద్ నుంచి వెళ్లారో లేదో.. బీహార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నగరానికి అలా చేరుకున్నారు. ఆదివారం (ఫిబ్రవరి 04) సాయంత్రం 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్ వచ్చారు. బీహార్లో కొత్తగా ఏర్పాటైన జేడీయూ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఈ నెల 12న అక్కడి అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో బీహార్లోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు రక్షణగా ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు తరలించారు. హైదరాబాద్కు 25 కిలోమీటర్ల దూరంలోని ఇబ్రహీంపట్నంలోని ఓ రిసార్ట్లో వారిని ఉంచారు. బీహార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఈ నెల 12వ తేదీ వరకు రిసార్టులో ఉంచాలని ఏఐసీసీ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. అయితే జార్ఖండ్ ఎమ్మెల్యేల మాదిరిగా కాకుండా రిసార్టులకే పరిమితం కాకుండా నగరంలో షాపింగ్ చేసినట్లు తెలిసింది. బీహార్కు చెందిన 21 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆదివారం రాత్రి హైదరాబాద్కు రాగా, మరికొంతమంది సోమవారం వచ్చారు. కానీ చాలా మందిని బీహార్ నుంచి హడావుడిగా హైదరాబాద్ తీసుకొచ్చారు.
Read also: Mumbai Indians: రోహిత్ సతీమణి సంచలన కామెంట్స్.. కావాలనే హిట్మ్యాన్ కెప్టెన్సీపై వేటు వేశారా?
Also Read
దీంతో కనీసం బట్టలు కూడా తీసుకోకుండా నాయకులు హైదరాబాద్ చేరుకున్నారని సమాచారం. వారిలో చాలా మందికి పాన్ మసాలాలు తినే అలవాటు ఉన్నట్లు తెలిసింది. దీంతో సోమవారం నగరంలో పలువురు ఎమ్మెల్యేలు బట్టలు, పాన్ మసాలాలు, ఖైనీలు కొనుగోలు చేసినట్లు సమాచారం. కొందరు ఎమ్మెల్యేలకు పాన్ మసాలా, ఖైనీ తినడం అలవాటు.. కావున బీహార్ నుంచి తెచ్చిన పాన్ మసాలా అయిపోవడంతో.. స్థానిక కాంగ్రెస్ నేతలు ఏర్పాటు చేసిన కార్లలో షాపింగ్ చేశారు. మరికొందరు బట్టలు కొన్నారు.. చార్మినార్ చూడాలని ఎమ్మెల్యేలు అన్నారు. ఏఐసీసీ అనుమతిస్తే అక్కడికి తీసుకెళ్తామని, తెలంగాణకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత ఒకరు వెల్లడించారు. కాగా.. ఇటీవల నితీష్ కుమార్ భారత్ కూటమికి గుడ్ బై చెప్పి ఎన్డీయే కూటమిలో చేరిన సంగతి తెలిసిందే. బీహార్ అసెంబ్లీలో 243 మంది సభ్యులున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు 122 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఎన్డీయే కూటమిలో బీజేపీకి 78, జేడీయూకి 45, హిందుస్థాన్ అవామీ మోర్చాకు నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆర్జేడీకి 79 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్కు 22 మంది, వామపక్షాలకు 10 మందికి పైగా ఎమ్మెల్యేలు ఉన్నారు.
Kalki: డేట్ మిస్ అయ్యే ప్రసక్తే లేదు…
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!