Bihar Congress: హైదరాబాద్ లో బీహార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల షాపింగ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bihar Congress: జార్ఖండ్ ఎమ్మెల్యేలు హైదరాబాద్ నుంచి వెళ్లారో లేదో.. బీహార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నగరానికి అలా చేరుకున్నారు. ఆదివారం (ఫిబ్రవరి 04) సాయంత్రం 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్ వచ్చారు. బీహార్లో కొత్తగా ఏర్పాటైన జేడీయూ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఈ నెల 12న అక్కడి అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో బీహార్లోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు రక్షణగా ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు తరలించారు. హైదరాబాద్కు 25 కిలోమీటర్ల దూరంలోని ఇబ్రహీంపట్నంలోని ఓ రిసార్ట్లో వారిని ఉంచారు. బీహార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఈ నెల 12వ తేదీ వరకు రిసార్టులో ఉంచాలని ఏఐసీసీ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. అయితే జార్ఖండ్ ఎమ్మెల్యేల మాదిరిగా కాకుండా రిసార్టులకే పరిమితం కాకుండా నగరంలో షాపింగ్ చేసినట్లు తెలిసింది. బీహార్కు చెందిన 21 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆదివారం రాత్రి హైదరాబాద్కు రాగా, మరికొంతమంది సోమవారం వచ్చారు. కానీ చాలా మందిని బీహార్ నుంచి హడావుడిగా హైదరాబాద్ తీసుకొచ్చారు.
Read also: Mumbai Indians: రోహిత్ సతీమణి సంచలన కామెంట్స్.. కావాలనే హిట్మ్యాన్ కెప్టెన్సీపై వేటు వేశారా?
Also Read
- Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
- Cheyutha Pension : చేయూత పింఛన్కు రేపే డెడ్లైన్.. మిస్ అయితే కష్టమే.!
దీంతో కనీసం బట్టలు కూడా తీసుకోకుండా నాయకులు హైదరాబాద్ చేరుకున్నారని సమాచారం. వారిలో చాలా మందికి పాన్ మసాలాలు తినే అలవాటు ఉన్నట్లు తెలిసింది. దీంతో సోమవారం నగరంలో పలువురు ఎమ్మెల్యేలు బట్టలు, పాన్ మసాలాలు, ఖైనీలు కొనుగోలు చేసినట్లు సమాచారం. కొందరు ఎమ్మెల్యేలకు పాన్ మసాలా, ఖైనీ తినడం అలవాటు.. కావున బీహార్ నుంచి తెచ్చిన పాన్ మసాలా అయిపోవడంతో.. స్థానిక కాంగ్రెస్ నేతలు ఏర్పాటు చేసిన కార్లలో షాపింగ్ చేశారు. మరికొందరు బట్టలు కొన్నారు.. చార్మినార్ చూడాలని ఎమ్మెల్యేలు అన్నారు. ఏఐసీసీ అనుమతిస్తే అక్కడికి తీసుకెళ్తామని, తెలంగాణకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత ఒకరు వెల్లడించారు. కాగా.. ఇటీవల నితీష్ కుమార్ భారత్ కూటమికి గుడ్ బై చెప్పి ఎన్డీయే కూటమిలో చేరిన సంగతి తెలిసిందే. బీహార్ అసెంబ్లీలో 243 మంది సభ్యులున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు 122 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఎన్డీయే కూటమిలో బీజేపీకి 78, జేడీయూకి 45, హిందుస్థాన్ అవామీ మోర్చాకు నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆర్జేడీకి 79 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్కు 22 మంది, వామపక్షాలకు 10 మందికి పైగా ఎమ్మెల్యేలు ఉన్నారు.
Kalki: డేట్ మిస్ అయ్యే ప్రసక్తే లేదు…
తాజావార్తలు
-
Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
-
Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
-
Veta: ‘పెదరాయుడు’ లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
-
PhonePe: ఇంటర్నెట్ లేకున్నా UPI సేవలు.. కొత్త సర్వీస్ ప్రారంభించిన ఫోన్పే..
-
Kalabhairava : కావ్య కల్యాణ్రామ్తో రిలేషన్ అనౌన్స్ చేసిన కాలభైరవ
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!