Bihar Congress: హైదరాబాద్ లో బీహార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల షాపింగ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bihar Congress: జార్ఖండ్ ఎమ్మెల్యేలు హైదరాబాద్ నుంచి వెళ్లారో లేదో.. బీహార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నగరానికి అలా చేరుకున్నారు. ఆదివారం (ఫిబ్రవరి 04) సాయంత్రం 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్ వచ్చారు. బీహార్లో కొత్తగా ఏర్పాటైన జేడీయూ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఈ నెల 12న అక్కడి అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో బీహార్లోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు రక్షణగా ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు తరలించారు. హైదరాబాద్కు 25 కిలోమీటర్ల దూరంలోని ఇబ్రహీంపట్నంలోని ఓ రిసార్ట్లో వారిని ఉంచారు. బీహార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఈ నెల 12వ తేదీ వరకు రిసార్టులో ఉంచాలని ఏఐసీసీ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. అయితే జార్ఖండ్ ఎమ్మెల్యేల మాదిరిగా కాకుండా రిసార్టులకే పరిమితం కాకుండా నగరంలో షాపింగ్ చేసినట్లు తెలిసింది. బీహార్కు చెందిన 21 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆదివారం రాత్రి హైదరాబాద్కు రాగా, మరికొంతమంది సోమవారం వచ్చారు. కానీ చాలా మందిని బీహార్ నుంచి హడావుడిగా హైదరాబాద్ తీసుకొచ్చారు.
Read also: Mumbai Indians: రోహిత్ సతీమణి సంచలన కామెంట్స్.. కావాలనే హిట్మ్యాన్ కెప్టెన్సీపై వేటు వేశారా?
Also Read
- Telangana Health: జాతీయ స్థాయిలో మెరిసిన తెలంగాణ.. రూ.200 కోట్లు అదనపు నిధులు ప్రకటన..
- KTR: 'రైతులకు యూరియా లేదు.. ఢిల్లీకి మాత్రం సంచులు ఉన్నాయి'..
- Uday Krishna Reddy: లైంగిక వేధింపుల కేసులో ట్విస్ట్.. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణ రెడ్డి ఆత్మహత్య యత్నం..!
- Hyderabad: హైదరాబాద్లో కలకలం.. ఇంటి నుంచి వెళ్లిన ముగ్గురు బాలికలు మిస్సింగ్.!
దీంతో కనీసం బట్టలు కూడా తీసుకోకుండా నాయకులు హైదరాబాద్ చేరుకున్నారని సమాచారం. వారిలో చాలా మందికి పాన్ మసాలాలు తినే అలవాటు ఉన్నట్లు తెలిసింది. దీంతో సోమవారం నగరంలో పలువురు ఎమ్మెల్యేలు బట్టలు, పాన్ మసాలాలు, ఖైనీలు కొనుగోలు చేసినట్లు సమాచారం. కొందరు ఎమ్మెల్యేలకు పాన్ మసాలా, ఖైనీ తినడం అలవాటు.. కావున బీహార్ నుంచి తెచ్చిన పాన్ మసాలా అయిపోవడంతో.. స్థానిక కాంగ్రెస్ నేతలు ఏర్పాటు చేసిన కార్లలో షాపింగ్ చేశారు. మరికొందరు బట్టలు కొన్నారు.. చార్మినార్ చూడాలని ఎమ్మెల్యేలు అన్నారు. ఏఐసీసీ అనుమతిస్తే అక్కడికి తీసుకెళ్తామని, తెలంగాణకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత ఒకరు వెల్లడించారు. కాగా.. ఇటీవల నితీష్ కుమార్ భారత్ కూటమికి గుడ్ బై చెప్పి ఎన్డీయే కూటమిలో చేరిన సంగతి తెలిసిందే. బీహార్ అసెంబ్లీలో 243 మంది సభ్యులున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు 122 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఎన్డీయే కూటమిలో బీజేపీకి 78, జేడీయూకి 45, హిందుస్థాన్ అవామీ మోర్చాకు నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆర్జేడీకి 79 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్కు 22 మంది, వామపక్షాలకు 10 మందికి పైగా ఎమ్మెల్యేలు ఉన్నారు.
Kalki: డేట్ మిస్ అయ్యే ప్రసక్తే లేదు…
తాజావార్తలు
-
Nag Chaitanya: ‘ఆ రోజు నుంచే అఖిల్ నా హీరో’.. తమ్ముడిపై నాగచైతన్య ఎమోషనల్ కామెంట్స్!
-
Public Charging: రైల్వే స్టేషన్లో ఫోన్ ఛార్జింగ్ పెడుతున్నారా? జర జాగ్రత్త.. మీ బ్యాంక్ ఖాతా ఖాళీ కావచ్చు!
-
Akhil Akkineni : మూడో రోజుకి బ్రేక్ ఈవెన్ అవ్వడం చాలా చాలా రోజుల తర్వాత జరిగింది
-
Oppo New Mobile: 10,000mAh బ్యాటరీ, 50MP సెల్ఫీ కెమెరా.. లాంచ్కు ముందే లీకైన ఒప్పో A7 ప్రో మాక్స్ ఫీచర్స్ ఇవే..
-
Hamas: హమాస్కు కొత్త బాస్.. ఖలీల్ అల్-హయ్యా చేతుల్లోకి పగ్గాలు!
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!