Komati Reddy: తెలంగాణలో కుటుంబ పాలన అంతమైంది.. ప్రజాపాలన ప్రారంభమైంది..
Komati Reddy: తెలంగాణలో కుటుంబ పాలన అంతమై ప్రజా పాలన ప్రారంభమైందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. చిట్యాల-భువనగిరి రోడ్డు నిర్మాణం త్వరలో ప్రారంభించి ప్రమాదాలు జరగకుండా చూస్తామని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన తొలిసారిగా ఇవాళ నకిరేకల్, నల్గొండ నియోజకవర్గాల్లో పర్యటించారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మంత్రికి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ చిట్యాలలోని జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ నిర్మాణానికి జనవరి 2న టెండర్లు ప్రారంభించి సంక్రాంతికి శంకుస్థాపన చేస్తామన్నారు.
Read also: Harish Shankar: రీమేక్స్ మాస్టర్… ఒరిజినల్ చూసినోడు కూడా విజిల్స్ వేయాల్సిందే
Also Read
చిట్యా మున్సిపాలిటీకి అధిక నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. జిల్లా మంత్రుల ఆధ్వర్యంలోనే ముఖ్యమైన శాఖలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ 11 స్థానాల్లో విజయం సాధించి నల్గొండ జిల్లా కాంగ్రెస్కు కంచుకోట అని మరోసారి రుజువు చేసిందన్నారు. డిసెంబర్ 3న అసలైన తెలంగాణ సిద్ధిస్తుందని.. 100 రోజుల్లో ఆరు హామీ పథకాలు అమలు చేస్తామని మరోసారి స్పష్టం చేశారు. నల్గొండ అభివృద్ధే తమ లక్ష్యమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో కుటుంబ పాలన అంతమై ప్రజా పాలన ప్రారంభమైందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తానని హామీ ఇచ్చారు. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులను ఆరు నెలల్లో పూర్తి చేస్తామన్నారు.
Harish Shankar: రీమేక్స్ మాస్టర్… ఒరిజినల్ చూసినోడు కూడా విజిల్స్ వేయాల్సిందే
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఐఏఎస్ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ
-
House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
-
Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
-
Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
-
Angkrish Raghuvanshi: రేర్ డిస్మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!