NTV Telugu Site icon

Bharat Jodo Yatra: రెండోరోజు ప్రారంభం.. కన్యకాపరమేశ్వరి ఆలయానికి రాహుల్

Bharathjudo Yatra

Bharathjudo Yatra

Bharat Jodo Yatra: ఏఐసీసీ నేత రాహుల్‌ గాంధీ దేశవ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. నేడు తెలంగాణలో రెండోరోజు పాదయాత్ర సాగనుంది. నేడు ఉదయం 6 గంటల 30నిమిషాలకు మక్తల్‌ నుంచి రాహుల్‌ పాదయాత్ర మొదలైంది. కన్యకాపరమేశ్వరి ఆలయంలో రాహుల్ గాంధీ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. పెద్దచెరువు, దండు క్రాస్, గొల్లపల్లి క్రాస్ మీదుగా బండ్లగుంట వరకు రాహుల్ పాదయాత్ర సాగనుంది. బండ్లగుంట వద్ద రాహుల్ లంచ్ అనంతరం రాత్రి గుడిగండ్ల గ్రామంలో రాహుల్ సభ నిర్వహించనున్నారు. మొదటిరోజు 26 కి.మీ రాహుల్ పాదయాత్ర సాగనుంది.

Read also: What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

రాహుల్‌ గాంధీ చేస్తున్న భారత్‌ జోడో యాత్ర ఆదివారం తెలంగాణ లోకి ప్రవేశించింది. రాయచూర్ యర్మరస్ నుండి మహబూబ్ నగర్ జిల్లా థాయ్ రోడ్ సర్కిల్ వరకు రాహుల్ యాత్ర సాగింది. ఆదివారం (23)న దాదాపు 13 కిలోమీటర్ల మేర సాగిన విషయం తెలిసిందే. కృష్ణ నది ‌బ్రిడ్జి‌ మీద రాహుల్ గాంధీకి తెలంగాణ కాంగ్రెస్ నేతలు. రాహుల్‌ గాందీకి రేవంత్ రెడ్డి, మాణిక్కం ఠాగూర్‌ ఘనస్వాగతం పలికారు. డికే శివకుమార్‌ నుంచి రేవంత్‌ రెడ్డి జాతీయ జెండాను తీసుకుని పాదయాత్రలో పాల్గొన్నారు. మూడురోజుల బ్రేక్‌ తరువాత భారత్‌జూడో యాత్ర ప్రారంభమైంది. నిన్న సాయంత్రం ఢిల్లీ నుంచి మక్తల్‌ కు చేరుకున్న రాహుల్‌ గాంధీ నేడు అక్కటినుంచే ప్రారంభమైంది. తెలంగాణ రాహుల్ పాదయాత్రతో కాంగ్రెస్‌ నేతల్లో జోష్ మొదలైంది.
Yama Dwitiya 2022 Special Lord Shiva Sahasranama Stotram Live: తొలి కార్తిక గురువారం నాడు ఈ స్తోత్రం వింటే చిరకాల కోరికలు నెరవెరతాయి