Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Karimnagar Bandisanjay Sensational Comments

Bandi Sanjay: గల్లీలో ఎవరున్నా సరే.. ఢిల్లీలో మోడీ మాత్రమే ఉండాలి..!

Published Date :January 25, 2024 , 1:56 pm
By Bhanu
Bandi Sanjay: గల్లీలో ఎవరున్నా సరే.. ఢిల్లీలో మోడీ మాత్రమే ఉండాలి..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Bandi Sanjay: గల్లీలో ఎవరున్నా సరే ఢిల్లీలో మాత్రం ప్రధాని నరేంద్ర మోడీ మాత్రమే ఉండాలని ఎంపి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ లోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాల పార్లమెంట్ స్థాయి నమో నవ యువ ఓటర్లు సమ్మేళనంలో బండి సంజయ్ కుమార్ పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. ఓటు హక్కు అనేది ఒక ఆయుధం లాంటిది.. ఒక్క ఓటుతో దేశ భవిష్యత్తు మారిపోతుందన్నారు. పేద, మధ్యతరగతి వాళ్ళు మాత్రమే ఓట్లు వేస్తున్నారని అన్నారు. బాగా డబ్బు సంపాదించి ఆర్థికంగా ఉన్న వాళ్ళు ఓట్లు వేయడం లేదని అన్నారు. ఒక్క ఓటుతో ఎన్నికల్లో ఓడిపోయినా వ్యక్తులు ఎందరో నాయకులు ఉన్నారని తెలిపారు. సమాజంలో ఓటు వేస్తేనే విలువ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. దేశంలో మరొక్కసారి ప్రధాని గా మోడీ కావాలంటే కరీంనగర్ లో బిజెపి అభ్యర్థి గెలవాలన్నారు. 2047 సంవత్సరం వరకు దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగు పరిచే దిశగా మార్చడమే మోడీ లక్ష్యం మని అన్నారు. దేశంలో ఉన్న నిరుద్యోగులకు ఎలాంటి అవినీతికి తావు లేకుండా ఉద్యోగాలు కల్పించారన్నారు.

పేద,మధ్యతరగతి కుటుంబాలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన వ్యక్తి ప్రధాని మోడీ అని తెలిపారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో అభివృద్ది కోసం 8వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం నుండి తీసుకువచ్చామన్నారు. 10 ఏండ్లు పాలించిన బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందన్నారు. సోషల్ మీడియా అని మీటింగ్ లు పెట్టీ తప్పుడు పోస్టులు పెట్టీ బిజెపి పార్టీ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. విద్యార్థులు, నిరుద్యోగుల కోసం కొట్లాడితే నాపై అక్రమంగా 100 కేసులు పెట్టించి అనేక ఇబ్బందులు పెట్టారన్నారు. తనని, తన కుటుంబాన్ని చంపుతానని అనేక సార్లు బెదిరించారని తెలిపారు. తను ఏ మతానికి, కులానికి వ్యతిరేకం కాదన్నారు. కానీ.. నా ధర్మం గురించి మాత్రం గొప్పగా చెప్పుకుంటామన్నారు. అయోధ్య రామ మందిరం కోసం అనేక మంది కర సెవకులు తమ ప్రాణాలను లెక్క చేయకుండా పోరాటం చేశారన్నారు. రాముని అక్షింతలతో కొంతమంది నాయకులు రేషన్ బియ్యం అంటూ ఎగతాళిగా మాట్లాడారని మండిపడ్డారు.

Also Read

  • KTR: కేసీఆర్ అప్పుడే చిలుకకు చెప్పినట్టు చెప్పారు.. కల్వకుర్తి సభను గుర్తు చేసిన కేటీఆర్..
  • Uttam Kumar Reddy: ప్రాణహిత-చేవెళ్లపై వెనక్కి తగ్గేదే లేదు! తుమ్మిడిహట్టి ప్రతిపాదనలపై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన
  • Malla Reddy: పార్టీ మార్పుపై మాజీ మంత్రి మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు..
  • Kodandaram: మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ చెప్పలేదు, నేను అడగలేదు

జమ్ము కాశ్మీర్ లో 370 డి ఆర్టికల్ కోసం పోరాడిన ఎందరో విద్యార్థి విద్యార్థులను పొట్టన పెట్టుకున్నారని తెలిపారు. ఏంఐఎం నాయకులు హిందూ దేవుళ్ల పట్ల అసభ్యకరంగా మాట్లాడారని తెలిపారు. గల్లీలో ఎవరున్నా సరే ఢిల్లీలో మాత్రం ప్రధాని నరేంద్ర మోడీ మాత్రమే ఉండాలని కీలక వ్యాఖ్యలు చేశారు. యువతి, యువకులు దేశ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని తమ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. ఎబివిపి కార్యకర్తల పట్ల పోలీసుల దాడిని బండి సంజయ్ ఖండించారు. విద్యార్థుల సమస్యల పరిష్కరించాలని నిరసన చేస్తున్న ఎబివిపి కార్యదర్శి జాన్షి పై పోలీసుల జులుం హేయమైన చర్య అన్నారు. గత ప్రభుత్వం లాగానే ఈ ప్రభుత్వం దుర్మార్గమైన చర్య కొనసాగిస్తుందని మండిపడ్డారు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
MLC Kavitha: జీవన్ రెడ్డి గారు మీ వైఖరి ఎక్కువ రోజులు నిలబడదు.. కవిత కౌంటర్

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bandisanjay comments
  • Bandisanjay sensational comment
  • Bandisanjay sensational comments

తాజావార్తలు

  • Ramya Krishna : రేపు పెళ్లి అనంగా.. రాత్రి 2 వరకు ఎన్టీఆర్ తోనే ఉన్న..!

  • Donald Trump: ట్రంప్‌ను రోస్ట్ చేసిన కింగ్ చార్లెస్.. మేము లేకపోతే మీరు ఫ్రెంచ్ మాట్లాడేవారంటూ ఎగతాళి

  • KTR: కేసీఆర్ అప్పుడే చిలుకకు చెప్పినట్టు చెప్పారు.. కల్వకుర్తి సభను గుర్తు చేసిన కేటీఆర్..

  • Uttam Kumar Reddy: ప్రాణహిత-చేవెళ్లపై వెనక్కి తగ్గేదే లేదు! తుమ్మిడిహట్టి ప్రతిపాదనలపై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన

  • Malla Reddy: పార్టీ మార్పుపై మాజీ మంత్రి మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు..

ట్రెండింగ్‌

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions