Chigirintha Parijatha: రాజకీయాలు తట్టుకోలేకే రాజీనామా.. అందుకే ఆపార్టీలో చేరుతున్నా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి భారీగానే రాజీనామాలు వెలువెత్తుతున్నాయి. అయితే.. నేడు టీఆర్ఎస్ కి మరో షాక్ తగిలిందనే చెప్పాలి.. బడంగ్పేట్ మేయర్ చిగిరింత పారిజాతానర్సింహారెడ్డి టీఆర్ఎస్కు గుడ్బై చెప్పారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఆమె తన రాజీనామా లేఖను పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్రెడ్డికి మెయిల్ ద్వారా పంపించారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ.. బడంగ్పేట్ అభివృద్ధి కోసం అప్పటి పరిస్థితుల నేపథ్యంలో టీఆర్ఎస్లో చేరానని, పార్టీలోని కొందరు తన ఎదుగుదలను జీర్ణించుకోలేక కొంతకాలంగా వ్యతిరేక భావనను ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. అంతేకాకుండా.. క్రమశిక్షణతో, పార్టీపై అంకితభావంతో ప్రజలకు సేవలందించిన తనకు పార్టీలో జరుగుతున్న పరిణామాలు దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయని అన్నారు.. అంతేకాకుండా.. కక్ష సాధింపు రాజకీయాలు తట్టుకోలేకే రాజీనామా చేస్తున్నానని స్పష్టం చేశారు. కాగా.. ఇప్పటివరకు తమకు సహకరించిన పార్టీ పెద్దలకు.. నాయకులకు ఆమె ధన్యవాదాలు చెప్పారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు.
Also Read
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!