Site icon NTV Telugu

తెలంగాణలో త్వరలోనే ఆయుష్మాన్ భారత్‌ అమలు…

ayushman bharat

ayushman bharat

తెలంగాణలో త్వరలోనే ఆయుష్మాన్ భారత్‌ అమలు కానుంది. ఆరోగ్యశ్రీ+ఆయుష్మాన్ భారత్ పేరుతో అమలు చేసేందుకు కసరత్తు చేస్తుంది ప్రభుత్వం. రెండు స్కీంలు కలయికతో వచ్చే సమస్యలు, సాధ్యసాధ్యాలపై ప్రభుత్వ కసరత్తు చేస్తుంది. అన్నీ ఒకే అయితే ఈ వారంలో అధికారిక ప్రకటన రానుంది. కరోనాతో పాటు అనేక వ్యాధులకు చికిత్స ఇందులోనే ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. ఆరోగ్యశ్రీలో లేని 685 చికిత్సలు అయుష్మాన్ ద్వారా అనుసంధానం కానున్నాయి. దేశంలో ఎక్కడైనా చికిత్స చేయించుకునే వెసులుబాటు కల్పిస్తుంది. ఆయుష్మాన్ భారత్ స్కీమ్‌ను మొదట ప్రభుత్వ ఆస్పత్రుల్లో అమలు చేయనున్నారు.

అయితే ఆరోగ్యశ్రీలో ఒక కుటుంబానికి ఏడాదికి రూ.2 లక్షల వరకూ ఉచిత వైద్యం.. కానీ ఆయుష్మాన్‌లో కలిస్తే రూ.5 లక్షల వైద్యం ఇవ్వనున్నారు. ప్రస్తుతం ఆరోగ్యశ్రీలో 972 రకాల ట్రీట్‌మెంట్ ప్రొసీజర్స్ కవర్ అవుతుండగా, ఆయుష్మాన్‌లో 1,350 చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. రెండింటిని కలిపి అమలు చేస్తే రాష్ట్ర ప్రజలకు 1,887 రకాల చికిత్సలకు ఉచిత వైద్యం ఇవ్వనున్నారు. దీంతో 26.11 లక్షల కుటుంబాలకు మేలు కలగనుంది.

Exit mobile version