Amazon Fraud: అమెజాన్ లో అయోధ్య నకిలీ ప్రసాదం అమ్మకాలు.. కేంద్రం నోటీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amazon Fraud: అమెజాన్ లో అయోధ్య లడ్డూల పేరుతో నకిలీ ప్రసాదం అమ్మకాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. అయోధ్య లడ్డూలు అంటూ అమెజాన్ లో ప్రసాదాల అమ్మకాలు మొదలు పెట్టింది. దీంతో భక్తులు, ప్రజలు కొనుగోలు చేసేందుకు భారీగా ఆర్డర్లు వచ్చాయి. భారీ లాభానికి అమెజాన్ ఇలాంటి దిగ్గజ కంపెనీలు తెగపడటం సంచలనంగా మారింది. అయోధ్యా రామ మందిరంలో రాముడి ప్రతిష్టనే ఇంకా జరిగేందుకు రెండు రోజులు వున్నా.. దానిని ఆసరాగా తీసుకున్న కొందరు అయోధ్య పేరుతో అమ్మకాలకు తెర లేపుతున్నారు. దిగ్గజకంపెనీలోనే ఒకటిగా పేరు పొందిన అమెజాన్ లో అయోధ్య పేరుతో నకిలీ ప్రసాదాలు అమ్మకానికి పెట్టడం కీలకంగా మారింది. ఇది నిజమని నమ్మిన కొందరు భక్తులు, ప్రజలు వేలకొద్ది ఆర్డర్లు పెట్టడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అమెజాన్ ఫ్రాఢ్ ని గమనించిన కేంద్రం దానిపై నోటీసులు జారీ చేసింది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ కు ఫిర్యాదు చేసింది. ఈవిషయం పై రంగంలోని దిగిన అధికారులు అమెజాన్ కు సెంట్రల్ కన్సుమర్ ప్రొటెక్షన్ అథారిటీ నోటీసులు జారీ చేసింది.
Read also: Top Headlines @ 9 AM : టాప్ న్యూస్
Also Read
- Bandi Bhagirath : బండి భగీరథ్ కోసం ముమ్మర వేట.. రంగంలోకి నాలుగు ప్రత్యేక బృందాలు..!
- NIMS : నిమ్స్లో 'కిడ్నీ రాకెట్'.. నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప క్లారిటీ
- Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
- Medical Shops: మే 20న రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ షాప్స్ బంద్.. కారణం ఏంటంటే?
సాధారణ మైన దూద్ పేడ లను.. అయోధ్య లడ్డూల పేరుతో అమెజాన్ విక్రయించడాన్ని తీవ్రంగా ఖండించింది. http://www.amazonలో స్వీట్ల విక్రయానికి సంబంధించి నోటీసు ఇచ్చింది. శ్రీరామ మందిర్ అయోధ్య ప్రసాదం ముసుగులో అమెజాన్ మిఠాయిల అమ్మకాలతో కూడిన మోసపూరిత వ్యాపార పద్ధతులకు పాల్పడుతోందని ఆరోపిస్తూ సిఎఐటి చేసిన ప్రాతినిథ్యం ఆధారంగా చర్య తీసుకుంది. ఏడు రోజుల్లోగా అమెజాన్ నుండి CCPA ప్రతిస్పందన కోరింది. లేని పక్షంలో వినియోగదారుల రక్షణ చట్టం, 2019లోని నిబంధనల ప్రకారం వారిపై అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపింది. దేశ వ్యాప్తంగా అయోద్యా రామ మందిరం హాట్ టాపిక్. జనవరి 22 న జరిగే రామ మందిర ప్రతిష్టకు యావత్ దేశంలోని ప్రముఖులు, భక్తులు హాజరుకానున్నారు. అయితే దీన్ని ఆసరాగా చేసుకుని కొన్ని కంపెనీ అయోధ్య పేరును వాడుకుంటున్నారు. అయోధ్య ప్రసాదం, విభూది, హారం, అకింతలు అంటూ ఆన్ లైన్ విక్రాయాలు చేస్తున్నారు. కొందరు భక్తులు దీనిని నమ్మి తెగ ఆర్డర్లు పెడుతున్నారు. అయితే గమనించవిషయం ఏమిటంటే.. ఇంకా రామ మందిర ప్రతిష్ట జరగకముందే ముందే ఎలా విక్రయాలు జరుపుతారు అనే ప్రశ్నలు మాత్రం ఎవరి రాకపోవడం విడ్డూరం. ఇప్పటికైనా ప్రజలు, భక్తులు ఇలాంటివి ఫ్రాడ్ ను నమ్మవద్దని అధికారులు తెలిపుతున్నారు.
తాజావార్తలు
-
YS Jagan: కూటమి ప్రభుత్వ పనితీరుపై జగన్ ఆసక్తికర ట్వీట్
-
Peddi: పెద్ది ట్రైలర్’పై చిరు రివ్యూ.. డైలాగ్ లీక్
-
NEET Paper Leak: పేపర్ సెట్ చేసినవారే లీక్ చేశారు.. NEET స్కాంలో మరో టీచర్ అరెస్ట్..
-
Bandi Bhagirath : బండి భగీరథ్ కోసం ముమ్మర వేట.. రంగంలోకి నాలుగు ప్రత్యేక బృందాలు..!
-
PM Modi: ప్రపంచం కొత్త సవాళ్లను ఎదుర్కొంటోంది.. భారత్ విశ్వసనీయ వారధి అన్న మోడీ
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..