NTV Telugu Site icon

పీజీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష రిపోర్టు గడువు పెంపు

తెలంగాణ సీపీజీఈటీ-2021లో మొదటి విడతలో సీట్లు సాధించిన వారు కళాశాలలో రిపోర్టు చేయాల్సిన తేదిలను అధికారులు పొడిగించారు. రాష్ర్టంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో పీజీ కోర్సుల సీట్ల భర్తీకి నిర్వహించిన ఈ ఉమ్మడి ప్రవేశ పరీక్షల్లో ఉతీర్ణులై తొలి విడతలో సీట్లు సాధించిన విద్యార్థులు కళాశాలల్లో ఈనెల15వ తేది వరకు రిపోర్టు చేయవచ్చని ప్రవేశ పరీక్షల కన్వీనర్‌ ఆచార్య పాండురంగారెడ్డి తెలిపారు.

కాగా అంతకముందు ఈ గడువు ఈనెల10 వరకు ఉండగా మరో 5 రోజులు పాటు పొడిగించినట్లు పేర్కొన్నారు. కాగా కోవిడ్‌ కారణంగా పరీక్షలు ఆలస్యం అయిన విషయం తెల్సిందే. విద్యార్థులు పొడిగించిన 5 రోజుల అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కళాశాలలో రిపోర్టు చేయాలని పాండురంగారెడ్డి అన్నారు. తమకు కేటాయించిన కళాశాలలో సీటును పొంది ఉన్న విద్యను అభ్యసించాలని ఆయన కోరారు.