Jagital Crime: పెళ్లైన ప్రేయసితో టచ్లో ప్రియుడు.. గొడ్డలితో నరికిన యువతి బంధువులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jagital Crime: ఇద్దరు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. అందరి ప్రేమకథలో జరిగినట్లే ఇతని ప్రేమ కథకు బ్రేక్ పడింది. ప్రియుడి ప్రేమకు ప్రియురాలి కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. ప్రియురాలిని వేరే అతనికి ఇచ్చి పెళ్లి చేశారు. అయితే అటు ప్రియురాలిని దూరం ఉండలేకపోయాడు ప్రేమికుడు. అయితే అమెకు పెళ్లి అయిపోయినా కూడా టచ్ లోనే ఉంటూ రోజూ ఫోన్ చేసి మాట్లాడే వాడు. అయితే కొద్దిరోజులు బాగానే ఉన్నా ఈ విషయం కాస్తా అమ్మాయి కుటుంబ సభ్యులకు తెలిసింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన అమ్మాయి బంధువులు ఆ యువకుడిని నడి రోడ్డుపై గొడ్డలితో కిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో కలకలం రేపింది.
జగిత్యాల జిల్లా బీర్పూర్కు చెందిన జువ్వికింది వంశీ తుంగూరులోని డ్రైవింగ్ స్కూల్లో పనిచేస్తున్నాడు. గతంలో వంశీ, అదే మండలానికి చెందిన యువతి ప్రేమించుకున్నారు. అయితే ఈ విషయం బాలిక తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో యువతికి కుటుంబ సభ్యులు ఆమెకు వేరే వ్యక్తితో పెళ్లి చేశారు. యువతికి పెళ్లయిన తర్వాత కూడా వంశీ తరచూ ఆమెతో ఫోన్లో మాట్లాడేవాడు. వారు కలుస్తున్నారని బాలిక కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వంశీని పలుమార్లు హెచ్చరించారు. అయినా కూడా వంశీలో ఎలాంటి మార్పు రాకపోవడంతో ఆవేశంతో రగిలిపోయారు. ఆదివారం కొల్వాయి నుంచి తుంగూరుకు ద్విచక్రవాహనంపై వెళుతున్న వంశీని అడ్డుకున్నారు. గొడ్డళ్లు, ఇతర ఆయుధాలతో తలపై దాడి చేశారు. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానిక సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు వంశీ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.
Also Read
- Workers Salary Hike: తెలంగాణ కార్మికులకు భారీ శుభవార్త.. కనీస వేతనాల పెంపుపై కీలక నిర్ణయం
- KTR: “కేబినెట్ సమావేశంలోనైనా కళ్లు తెరవండి”.. సీఎం రేవంత్కి కేటీఆర్ లేఖ
- Bandi Bhagirath Case: బండి భగీరథ్ కేసులో కొత్త ట్విస్ట్..
- IPL Ticket Scam: బాక్స్ టికెట్ ధర 10 లక్షలు.. పెద్దల రిఫరెన్స్ పెట్టినా నో యూజ్.. భారీగా క్యాష్ చేసుకుంటున్న ఎస్ఆర్హెచ్?
వంశీ హత్య విషయం తెలుసుకున్న బంధువులు, గ్రామస్తులు గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. వంశీ మృతి చెందిన ప్రదేశానికి వచ్చిన వారు ఆందోళనకు దిగారు. నిందితులను తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు. పోలీసులు వంశీ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించేందుకు ప్రయత్నించారు. మృతదేహాన్ని తరలిస్తే చనిపోతామంటూ వంశీ తల్లి భాగ్య లారీకింద వెళ్లే ప్రయత్నం చేసింది. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకుంది. పరిస్థితి తీవ్ర పరిణామాలకు దారితీయకుండా డీఎస్పీ ప్రకాష్, అలీ, సారంగాపూర్, రాయికల్ ఎస్సైలు తిరుపతి, అజయ్యలు మృతుడి బంధువులతో చర్చించారు. ఆరోపణలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో వంశీ కుటుంబ సభ్యులు శాంతించారు. తన కొడుకు వంశీని.. యువతి తండ్రి రమేష్, సోదరుడు విష్ణు హత్య చేశారని వంశీ తల్లి ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే వంశీ వద్ద ఫోన్ కనిపించకపోవడంతో.. హంతకులు తీసుకెళ్లి ఉంటారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వంశీ తండ్రి శ్రీహరి ఉపాధి నిమిత్తం ముంబైలో ఉంటున్నాడు. తల్లి కూలి చేస్తుంది. అయితే వంశీ హత్యతో జగిత్యాల జిల్లాలో తీవ్ర కలకలం రేపింది.
Telangana Rain: నేడు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్
తాజావార్తలు
-
AP: ఏపీ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నూతన కమిటీ నియామకం..
-
Giorgia Meloni: మెలోని పెళ్లెందుకు చేసుకోలేదు.. మెలోడీ వీడియో వైరల్ తర్వాత నెట్టింట తీవ్ర చర్చ
-
Pulwama Attack: అజ్ఞాత వ్యక్తుల సంచలనం.. పాక్లో పుల్వామా సూత్రధారి హతం..
-
Peddi Twist: ఢిల్లీ ఎపిసోడ్ ట్విస్ట్.. ‘ఉప్పెన’ క్లైమాక్స్ కంటే 100 రెట్లు ఎక్కువ!
-
Cockroach Janata Party: కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్ షాక్.. “ఎక్స్” అకౌంట్ నిలిపివేత..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!