Bonalu: తెలంగాణలో రేపటి నుంచి ఆషాఢ బోనాలు.. మొదటగా గోల్కండలో ఉత్సవాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bonalu: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా బోనాల పండుగను నిర్వహిస్తోంది. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా బోనాల పండుగకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ పండుగను ఆషాఢ మాసంలో జరుపుకుంటారు. ఈ మాసంలో ఎల్లమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. బోనం అంటే అమ్మవారికి సమర్పించే నైవేద్యం. మహిళలు వండిన అన్నంతో పాటు పాలు, పెరుగు, బెల్లం మరియు కొన్నిసార్లు ఉల్లిపాయలను మట్టి లేదా రాగి కుండలలో తలపై ఉంచి, ఆలయానికి వెళ్లి కల్లు కొమ్మతో పాటు అమ్మవారికి నైవేద్యాలు సమర్పిస్తారు.
తెలంగాణలో ఏటా జరిగే ఆషాడ బోనాలు ఈ నెల 22 నుంచి అంటే రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. నెల రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలు గోల్కొండ బోనాలతో ప్రారంభమవుతాయి. లంగర్ హౌజ్ వద్ద ఏర్పాటు చేసిన గోల్కొండ బోనాల తొట్టెల ఊరేగింపులో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి, మహమూద్ అలీ పాల్గొంటారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రులు పట్టువస్త్రాలు సమర్పిస్తారు. బోనాలకు లక్షలాది మంది భక్తులు వచ్చేందుకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఏర్పాట్లపై మంత్రి తలసాని వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. ఆషాఢ బోనాల పండుగతో జంటనగరాలు నెల రోజుల పాటు కోలాహలంగా మారనున్నాయి.
Also Read
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
- SIR Extended: తెలంగాణలో సర్ పొడిగింపు.. ఏ తేదీ వరకంటే..
- HMDA చీఫ్ ఇంజనీర్ పై ACB ఉక్కుపాదం.. 20 గంటల సోదాలు.. రూ.100 కోట్ల ఆస్తుల గుర్తింపు.!
- Hyderabad: దారుణం.. 7వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం.! నిందితుడు అరెస్ట్..
Read also: Rashmika Mandana : రణ్ బీర్ కపూర్ పై పొగడ్తల వర్షం కురిపించిన రష్మిక..
బేగంపేటలోని హరిత ప్లాజాలో పంజరాల ఏర్పాట్లపై పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడారు జూన్ 22న హైదరాబాద్ గోల్కొండలో ఆషాడ బోనాలు ప్రారంభమవుతాయని తెలిపారు. జులై 9న సికింద్రాబాద్ మహంకాళి బోనాల ఉత్సవం ప్రారంభం కాగా, జూలై 10న ఊరేగింపు నిర్వహించనున్నారు. పాతబస్తీలో బోనాల ఉత్సవం జూలై 16న ప్రారంభమవుతుందని, మరుసటి రోజు జూలై 17న ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఊరేగింపు నిర్వహించనున్నారు. ఈ ఏడాది ఉత్సవాలకు ప్రభుత్వం 15 కోట్ల రూపాయలు కేటాయించిందని, రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని మంత్రి తెలిపారు. తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా బోనాల పండుగను నిర్వహిస్తామన్నారు.
Bhatti Vikramarka: భట్టి విక్రమార్కకు మరోసారి వైద్య పరీక్షలు.. పాదయాత్రకు బ్రేక్..
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!