కర్ణాటకలో చెలరేటిన హిజాబ్ వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. అయితే తాజాగా లోక్సభ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆదివారం ట్విట్లర్ వేదికగా.. హిజాబ్ ధరించిన అమ్మాయి ఏదో ఒక రోజు భారత ప్రధానమంత్రి అవుతుందని అన్నారు. హిజాబ్లు ధరించినందుకు ముస్లిం విద్యార్థుల బృందం తమ కళాశాలలోకి ప్రవేశించకుండా నిరోధించిన తర్వాత కర్ణాటక హిజాబ్ వ్యవహారం చెలరేగిన నేపథ్యంలో ఇది జరిగింది. ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ చీఫ్ ఒవైసీ ఆదివారం ఒక వీడియోను ట్వీట్ చేశారు. అందులో హిజాబ్లు ధరించిన మహిళలు కాలేజీకి వెళ్తారని, జిల్లా కలెక్టర్లు, మేజిస్ట్రేట్లు, డాక్టర్లు, వ్యాపారవేత్తలు అవుతారని అన్నారు. ఉద్దేశించి ఒవైసీ మాట్లాడుతూ “నేను చూడటానికి జీవించి ఉండకపోవచ్చు, కానీ నా మాటలను గుర్తించుకోండి, ఒక రోజు హిజాబ్ ధరించిన అమ్మాయి ప్రధానమంత్రి అవుతుంది” అని వీడియోలో చెప్పడం వినవచ్చు. “మన ఆడపిల్లలు హిజాబ్లు ధరించాలని నిర్ణయించుకుని వారి తల్లిదండ్రులకు చెబితే, వారి తల్లిదండ్రులు వారికి మద్దతు ఇస్తారు, వారిని ఎవరు ఆపగలరో చూద్దాం! అని ఆయన అన్నారు.
Asaduddin Owaisi : హిజాబ్ ధరించిన అమ్మాయి ఇండియా ప్రధానమంత్రి అవుతుంది
