Rangam Bhavishyavani 2022: రంగం భవిష్యవాణి వినిపించిన స్వర్ణలత.. ఏం చెప్పారంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సికింద్రాబాద్ లో లక్సర్ బోనాలు ఘనంగా మొదలయ్యాయి. రంగంకోసం సర్వం సద్దం చేసారు అధికారుల. రంగంలో అమ్మవారి భవిష్యవాని ప్రారంభమైంది. అవివాహిత అయిన జోగిని శరీరంపై ఆవహించిన అమ్మవారు రంగంలో భవిష్యవాణి చెప్పిన స్వర్ణలత. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో మొక్కుబడిగా పూజలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. నన్ను సంతోషంగా చేయడం లేదని, మీ సంతోషం కోసం పూజలు చేయండి, సరిగ్గా పూజలు జరపడం లేదని పేర్కొన్నారు. ప్రతీ ఏటా చెబుతున్నా పట్టించుకోవడం లేదని అన్నారు. నాకు సక్రమంగా పూజలు జరిపించండి, శాస్త్రోక్తంగా నిర్వహించండని అన్నారు.
నేను మీ హృదయాల్లో దూరి కాపాడుతున్నాను అయినా నన్ను మీరు సంతోషంగా పూజలు జరిపించడంలేదని అన్నారు. ఏటికేటా నా రూపాన్ని మారుస్తున్నారని మండిపడ్డారు. నాకు స్థిరమైన రూపం కావాలని, నాది అంతా కాజేస్తున్నారంటూ ఆగ్రమం వ్యక్తం చేశారు. నేను సంతోషంగా లేను అయినా కూడా మిమ్మల్ని సంతోషంగా ఉండేలా చూస్తున్నానని అన్నారు. నా గర్భగుడిలో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించాలని తెలిపారు. నాపిల్లలైన గర్భణీ స్త్రీలకు, ఆడపిల్లకు తన కడుపునపెట్టుకుని చూసుకుంటున్నానని పలికారు. ఎన్ని తప్పులు చేసినా నా బిడ్డలేనని క్షమిస్తున్నాను అని అన్నారు. మొక్కుబడిగా పూజలు చేస్తున్నారని, గతంలో చేసినట్టుగా పూజలు చేయడంలేదని అమ్మవారు ఆగ్రహం వ్యక్తం చేసారు.
Also Read
- Se*xual Harassment : పోలీస్ అకాడమీలో పోకిరి.. లేడీ ట్రైనీ IPSపై లైంగిక వేధింపులు..
- Harish Rao : నన్ను కోస్తావా కోయ్.. కానీ కాళేశ్వరం మోటర్లు ఆన్ చెయ్.. రేవంత్కు హరీష్ సవాల్.!
- Uttam Kumar Reddy : సాగునీటి సంస్థల ఆర్థిక బలోపేతానికి మాస్టర్ ప్లాన్
- CM Revanth Reddy: పదవుల కోసం గాంధీ భవన్కు రావొద్దు.. పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
వర్షాల గురించి మాట్లాడుతూ.. గర్భాలయంలో శాస్త్రీయబద్దంగా పూజలు నిర్వహించాలని, తనబిడ్డలే అని ఇప్పటివరకు తాను సరిపెట్టుకుంటున్నారని అన్నారు. మీరు కళ్లు తెరవడానికే తాను కుంభవృష్టి వర్షాలు కురిపించానని, ఇప్పటికైనా తనకు సంతోషంగా పూజలు చేయాలని అన్నారు. గుండె మీద చేయి వేసుకుని చెప్పండి, మీరు సరిగ్గా పూజలు చేస్తున్నారా? అంటూ అమ్మవారు ప్రశ్నించారు. మీకు కనువిప్పు కలిగేందుకే ఈ కుంభవృష్టి వానలు కురిపిస్తున్నాని తెలిపారు. అమ్మవారికి శాస్త్రోక్తంగా పూజలు జరిపించాలని కోరారు.
తాజావార్తలు
-
Prasanna Kumar: టాలీవుడ్లో ముగిసిన యూనియన్ వార్.. రంగంలోకి దిగిన బాలయ్య!
-
Geetanjali Angmo: సుప్రీంకోర్టు మెట్లెక్కిన సోనమ్ వాంగ్చుక్ భార్య.. హైకోర్టు తీర్పుపై సవాల్!
-
Worst Bowling: యువకుడు, ఎత్తుగా ఉన్నాడు, బౌలింగ్ బాగా వేస్తాడు అనుకున్నారు.. కట్ చేస్తే చుక్కలు చూపించారు..
-
Sandeep Reddy: ప్రభాస్ ఫ్యాన్స్కు గుడ్న్యూస్ చెప్పిన వంగా.. ‘స్పిరిట్’ షూటింగ్పై క్రేజీ అప్డేట్!
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
ట్రెండింగ్
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!