Amit Shah: సీఎం కొడుకే సీఎం అవుతాడు.. దళితుడు కాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah Speech At Munugodu Samarabheri: దళితుడ్ని సీఎం చేస్తానని మాటిచ్చి కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారని.. ఆయన వెళ్లాక కేటీఆర్ బరిలోకి దిగుతాడని.. అంతేగానీ వాళ్లు దళితుడ్ని సీఎం చేయరని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. మునుగోడు సమరభేరిలో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ సర్కార్ పతనానికి ఇది నాంది అని, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలించేందుకే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారని అన్నారు. ఉప ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డిని గెలిపిస్తే.. ఒక పొగ మాదిరిగా కేసీఆర్ ప్రభుత్వం మాయమవుతుందన్నారు. సెప్టెంబర్లో తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహిస్తామని కేసీఆర్ ఇచ్చిన మాటను తప్పారని.. కానీ తాము అధికారంలోకి వస్తే సెప్టెంబర్ 17న కచ్ఛితంగా విమోచన దినం జరుపుతామని చెప్పారు. మజ్లిస్కి భయపడే.. కేసీఆర్ ఆ హామీని అమలు చేయడం లేదని అమిత్ షా ఆరోపించారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ వ్యక్తి ముఖ్యమంత్రి కాబోతున్నారని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ అండ్ కంపెనీ బూటకపు హామీలకు పెట్టింది పేరని.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నిలబెట్టుకోలేదని మండిపడ్డారు. నిరుద్యోగులకు నెలనెలా రూ.3 వేల భృతి, నల్గొండ జిల్లా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తామన్న హామీలను నెరవేర్చలేదని అన్నారు. ఆ హామీల సంగతి దేవుడెరుగు.. చివరికి ప్రధాని మోదీ మంజూరు చేస్తున్న టాయిలెట్లను సైతం ప్రజలకు అందకుండా సీఎం కేసీఆర్ అడ్డుకుంటున్నారని అమిత్ షా ఫైరయ్యారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా తెచ్చిన దళిత బంధు పతకాన్ని సైతం నీరుగార్చారన్నారు. ఎనిమిదేళ్ల పాలనలో కేసీఆర్ కుటుంబానికి తప్ప, యువకులకు ఉపాధి లభించలేదని అమిత్ షా వాపోయారు.
Also Read
రైతులు తెలంగాణలో బాగా నష్టపోతున్నారని, ప్రధాని భీమా పథకం ఇక్కడ అమలు చేయడం లేదని అమిత్ షా అన్నారు. కనీస మద్దతు ధరతో ధాన్యం కొనడం లేదన్నారు. తాము ప్రతి రైతు కుటుంబం నుంచి ప్రతి కిలో ధాన్యం సేకరిస్తామని హామీ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసీఆర్ కుటుంబానికి ఒక ఏటీఎంలా మారిందన్నారు. పెట్రోల్ ధరల్ని మోదీ రెండుసార్లు తగ్గించారని, కానీ కేసీఆర్ ఒక్కసారి కూడా తగ్గించలేదన్నారు. రాజగోపాల్ రెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపిస్తే, తెలంగాణలో అమలుకాని వాటిని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. బీజేపీ వస్తే.. గంగా ప్రవాహంలా తెలంగాణను అభివృద్ధి పరుస్తామన్నారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించాలని, విజయ సంకల్పం అందరూ తీసుకోవాలంటూ అమిత్ షా కోరారు.
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!