Amit Shah: సీఎం కొడుకే సీఎం అవుతాడు.. దళితుడు కాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah Speech At Munugodu Samarabheri: దళితుడ్ని సీఎం చేస్తానని మాటిచ్చి కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారని.. ఆయన వెళ్లాక కేటీఆర్ బరిలోకి దిగుతాడని.. అంతేగానీ వాళ్లు దళితుడ్ని సీఎం చేయరని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. మునుగోడు సమరభేరిలో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ సర్కార్ పతనానికి ఇది నాంది అని, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలించేందుకే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారని అన్నారు. ఉప ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డిని గెలిపిస్తే.. ఒక పొగ మాదిరిగా కేసీఆర్ ప్రభుత్వం మాయమవుతుందన్నారు. సెప్టెంబర్లో తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహిస్తామని కేసీఆర్ ఇచ్చిన మాటను తప్పారని.. కానీ తాము అధికారంలోకి వస్తే సెప్టెంబర్ 17న కచ్ఛితంగా విమోచన దినం జరుపుతామని చెప్పారు. మజ్లిస్కి భయపడే.. కేసీఆర్ ఆ హామీని అమలు చేయడం లేదని అమిత్ షా ఆరోపించారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ వ్యక్తి ముఖ్యమంత్రి కాబోతున్నారని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ అండ్ కంపెనీ బూటకపు హామీలకు పెట్టింది పేరని.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నిలబెట్టుకోలేదని మండిపడ్డారు. నిరుద్యోగులకు నెలనెలా రూ.3 వేల భృతి, నల్గొండ జిల్లా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తామన్న హామీలను నెరవేర్చలేదని అన్నారు. ఆ హామీల సంగతి దేవుడెరుగు.. చివరికి ప్రధాని మోదీ మంజూరు చేస్తున్న టాయిలెట్లను సైతం ప్రజలకు అందకుండా సీఎం కేసీఆర్ అడ్డుకుంటున్నారని అమిత్ షా ఫైరయ్యారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా తెచ్చిన దళిత బంధు పతకాన్ని సైతం నీరుగార్చారన్నారు. ఎనిమిదేళ్ల పాలనలో కేసీఆర్ కుటుంబానికి తప్ప, యువకులకు ఉపాధి లభించలేదని అమిత్ షా వాపోయారు.
Also Read
- Hyderabad Petrol Price: భాగ్యనగరంలో పెట్రోల్ మంట.. దేశంలోనే హైదరాబాద్లో అత్యధిక పెట్రోల్ ధర!
- Hyderabad: పక్కా ప్లాన్తో దోపిడీలు.. హైదరాబాద్ పోలీసులకు తలనొప్పిగా మారిన నేపాలీ గ్యాంగ్లు..
- Hyderabad: శంషాబాద్ ఎయిర్పోర్ట్కు బాంబు బెదిరింపు.. ఆ విమానమే టార్గెట్ అంటూ..
- DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
రైతులు తెలంగాణలో బాగా నష్టపోతున్నారని, ప్రధాని భీమా పథకం ఇక్కడ అమలు చేయడం లేదని అమిత్ షా అన్నారు. కనీస మద్దతు ధరతో ధాన్యం కొనడం లేదన్నారు. తాము ప్రతి రైతు కుటుంబం నుంచి ప్రతి కిలో ధాన్యం సేకరిస్తామని హామీ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసీఆర్ కుటుంబానికి ఒక ఏటీఎంలా మారిందన్నారు. పెట్రోల్ ధరల్ని మోదీ రెండుసార్లు తగ్గించారని, కానీ కేసీఆర్ ఒక్కసారి కూడా తగ్గించలేదన్నారు. రాజగోపాల్ రెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపిస్తే, తెలంగాణలో అమలుకాని వాటిని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. బీజేపీ వస్తే.. గంగా ప్రవాహంలా తెలంగాణను అభివృద్ధి పరుస్తామన్నారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించాలని, విజయ సంకల్పం అందరూ తీసుకోవాలంటూ అమిత్ షా కోరారు.
తాజావార్తలు
-
Peddi: కథే ‘పెద్ది’కి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అంటున్న బుచ్చిబాబు..
-
PM Modi: యూఏఈపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం.. భారత్-యూఏఈ మధ్య కీలక ఒప్పందాలు
-
Dharmendra Pradhan: నీట్ ప్రశ్నాపత్రం లీక్పై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సంచలన ప్రకటన!
-
Ambati Rayudu: IPL 2026లో తోపు కెప్టెన్ అతనే..
-
Bermuda Triangle Mystery: బెర్ముడా రహస్యాన్ని ఛేదించిన శాస్త్రవేత్తలు.. అక్కడ ఏముందంటే..
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!