Book Launch: సెస్లో ఆకిన వెంకటేశ్వర్లు రచించిన పుస్తకావిష్కరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Book Launch: ఆర్ధిక శాస్త్రంలో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో పీహెచ్డీ చేసిన ఆకిన వెంకటేశ్వర్లు తాజాగా పొలిటికల్ ఎకానమీ ఆఫ్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా అనే పుస్తకాన్ని హైదరాబాద్లోని సెస్లో మాజీ ప్రణాళిక సంఘం సభ్యుడు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత సీహెచ్ హనుమంతరావు ఆవిష్కరించారు. ఈ పుస్తకం 572 పేజీలలో 22 అధ్యాయాలుగా విభజించబడింది. ఇందులో ముఖ్య విషయాలన్నీ భారత దేశ వ్యవసాయ రంగం, అభివృద్ధి, ఎత్తుపల్లాల గురించి ఉంటుంది. బ్రిటీష్ వారు భారతదేశ వ్యవసాయాన్ని ఆహార పంటల నుంచి వాణిజ్య పంటల వైపు మళ్లించారు.. దాని పర్యావసనాలపై పుస్తకంలో ఆకిన వెంకటేశ్వర్లు వివరించారు. ఆయన తెలంగాణ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఆర్ధికశాస్త్ర అధ్యాపకుడిగా పనిచేశారు. 2002లో హైదరాబాద్లోని ఆర్ధిక, సామాజిక శాస్త్రాల అధ్యయన కేంద్రం (సెస్)లో పనిచేసి తర్వాతి కాలంలో అక్కడే సలహాదారుగా సేవలు అందించారు.
Read Also: రోజూ కోడిగుడ్డు తింటే.. ఇవి మీ సొంతం..!
Also Read
స్వాతంత్ర్యం అనంతరం ఆహార ధాన్యాల కొరత తీర్చడానికి అమెరికా నుంచి దిగుమతి చేసుకోవడం, భూసంస్కరణల ద్వారా జమీందారీ విధానం రద్దు, కౌలుదారు చట్టాల అమలు, దున్నేవానిదే భూమి-దాని పరిస్థితి, 1966లో తీవ్ర ఆహార ధాన్యాల సంక్షోభం ద్వారా సస్య విప్లవ దిగుమతి జరిగింది. భూగరిష్ట పరిమితి అమలు జరిగిన గ్రామీణ ప్రాంతాలలో సంక్షోభం, ప్రజాపంపిణీ వ్యవస్ధ కోసం భారత ఆహార సంస్థ ఏర్పడటం, ఎఫ్సీఐ ఆహార ధాన్యాల కనీస మద్దతు ధరకు రైతుల నుంచి కొనుగోలు చేయడం, 1991లో వచ్చిన నూతన ఆర్ధిక విధానాలు అమలు కావడం, 1995లో వరల్డ్ ట్రేడింగ్ ఆర్గనైజేషన్ చేరిన తర్వాత భారతదేశ రైతులు ఎగుమతులు పెంచుకోవచ్చనే విధానంలో పత్తి, మిర్చి పంటలు పండించగా రసాయనిక ఎరువులు, పురుగులమందు ధరలు పెరగడం వల్ల, ప్రభుత్వ సబ్సిడీలు తగ్గడం వల్ల, గిట్టుబాటు ధరలు తగ్గడం వల్ల రైతుల ఆత్మహత్యలు పెరిగాయి. రెండో సస్య విప్లవం కోసం బీటీ పత్తిని పెంచడం పెరిగింది. కానీ కనీస మద్దతు ధరలు ఉన్నా రైతులు నష్టాల బారిన పడటం వంటి అంశాలను పుస్తకంలో వివరించారు.
తాజావార్తలు
-
ICC Rules: వెస్టిండీస్ స్టార్ ‘ఎఫీ ఫ్లెచర్’ స్ఫూర్తితో.. మహిళా క్రికెటర్లకు ఐసీసీ భారీ ఊరట..
-
Minister Ramprasad Reddy: ఇక డీజిల్ బస్సులకు గుడ్బై..! త్వరలో 700 ఎలక్ట్రిక్ బస్సులు..
-
School Holiday: విద్యార్థులకు అలర్ట్.. రేపు పాఠశాలలకు సెలవు..?
-
Maharashtra: ఉద్ధవ్ ఠాక్రేకు భారీ షాక్.. షిండే గూటికి చేరిన ఆరుగురు ఎంపీలు
-
Epic : ఆనంద్ దేవరకొండ ఎపిక్ రిలీజ్ ఆరోజే!
ట్రెండింగ్
-
120Hz నుంచి 144Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 48MP కెమెరాతో Ai+ కొత్త 5G ఫోన్లు లాంచ్.. ధరలు, ఫీచర్లు ఇవే!
-
Thoothukudi Storm: సుడిగాలి బీభత్సం.. భారీ నష్టం, ఆరుగురికి తీవ్ర గాయాలు.!
-
Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!