తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జీగా పశ్చిమ బెంగాల్ సీనియర్ నేత దీపాదాస్ మున్షీని నియమించినట్టు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ప్రస్తుత ఇన్చార్జీగా ఉన్న మాణిక్ రావ్ ఠాక్రేను తప్పిస్తూ శనివారం ఏఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. పశ్చిమ బెంగాల్ సీనియర్ నేత దీపాదాస్ మున్షీని నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. పశ్చిమ బెంగాల్ సీనియర్ నేత ప్రియరంజన్ దాస్ మున్షీ సతీమణే దీపాదాస్ మున్షీ. కాగా ఇప్పటి వరకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జీగా వ్యవహరిస్తూ వచ్చిన మాణిక్ రావు ఠాక్రేను గోవా-డయ్యూ డామన్ వ్యవహారాల ఇన్ చార్జీగా నియమించినట్లు మరో ప్రకటన ఇచ్చింది. కాగా అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు మహారాష్ట్ర మాజీ పీసీసీ అధ్యక్షుడు మాణిక్ రావ్ ఠాక్రేను తెలంగాణ ఇన్చార్జీగా ఏఐసీసీ నియమించింది. ఠాక్రేకు ముందు ఇన్చార్జిగా పని చేసిన మాణిక్ రావ్ ఠాకూర్.. అప్పటి పీసీసీ అధ్యక్షుడు, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని సీనియర్లు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.