Icecream: హైదరాబాద్ లో కల్తీ ఐస్ క్రీమ్ తయారీ.. నకిలీ స్టిక్కర్లతో విక్రయాలు
Adulterated Ice Cream Manufacturing in Hyderabad: డబ్బు సంపాదనే లక్ష్యంగా కొందరు దుర్మార్గులు ప్రజల ప్రాణాలను పణంగా పెడుతున్నారు. కాసుల కోసం కక్కుర్తిపడి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. నిన్న అత్తాపూర్ లో నాసిరకం చాక్లెట్ల తయారీ దందా మరువకముందే కల్తీ ఐస్ క్రీమ్ తయారీ చేస్తున్న ముఠా గుట్టును మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు రట్టు చేశారు. మార్కెట్ లో డిమాండ్ వున్న బ్రాండెడ్ ఐస్ క్రీం కవర్ లతో నాసిరకం ఐస్ క్రీంలు తయారు చేస్తున్నట్టు పోలీస్ లు, ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. ప్రమాదకరమైన రసాయనాలు వాడి ఐస్ క్రీముల తయారీలో టేస్ట్ పెరగడానికి ప్రమాదకరమైన పౌడర్ ఉపయోగం చేస్తున్నారని తెలిపారు. తయారు చేసిన ఐస్ క్రీములకు బ్రాండెడ్ స్టికరింగ్ చేసి మార్కెట్ లో విక్రయం చేస్తున్నట్లు గుర్తించారు. వీటిని శుభకార్యాలకు సరఫరా చేసి సొమ్ము చేసుకుంటున్న కంత్రిగాళ్లను పోలీసులు అదుపులో తీసుకున్నారు. మనుషుల ఆరోగ్యాలతో ఆడుకుంటున్నారని, ధనార్జనే ధ్యేయంగా కల్తీలకు పాల్పడి సొమ్ము చేసుకుంటున్నారని అన్నారు.
విశ్వసనీయ సమాచారం మేరకు నకిలీ ఐస్ క్రీమ్ సంస్థపై చందానగర్ లో Sot రైడ్స్ చేశామని తెలిపారు. శ్రీనివాస్ రెడ్డి అనే నిందితుడు అరెస్ట్ చేశామని, పలు ప్లేవర్స్ ఐస్ క్రీమ్స్, బ్రాండెడ్ కంపినీల స్టికరింగ్ సీజ్ చేశామని తెలిపారు. ఈ దందాను గత ఐదు సంవత్సరాలుగా కొనసాగుతున్నట్లు గుర్తించారు. ఏలాంటి అనుమతులు లేకుండా ఐస్ క్రీమ్ పరిశ్రమను కొనసాగుతున్నట్లు గుర్తించారు పోలీసులు. అయితే.. ఫ్యాక్టరీ నిర్వాహకురాలు పద్మజ మాట్లాడుతూ.. మ్యాంగో బార్, ఆరంజ్ బార్ కవర్ లతో నాసిరకం ఐస్ క్రీమ్ ల తయారీ చేస్తున్నట్లు తెలిపారు. బెస్ట్ ఐస్ క్రీం పేరుతో మాకు అనుమతులు వున్నాయని నిర్వాహకులు చెబుతున్నారు. కొద్ది రోజుల కిందట ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ గడువు ముగిసిందని, రెన్యువల్ చేసుకోలేదని పేర్కొన్నారు. మ్యాంగో బార్, ఆరంజ్ బార్ కవర్ లతో ఐస్ క్రీం అమ్మటం పొరపాటే అని అన్నారు. ఈ కవర్ ల కోసం లక్ష రూపాయలు అడుగుతారని, అందుకే.. వారే ఆ స్టిక్కర్లు కొట్టించి నట్లు పద్మజ తెలిపారు.
Also Read
- GPO Promotions : గ్రామ పంచాయతీ అధికారుల ప్రమోషన్లకు గ్రీన్ సిగ్నల్
- Fuel Shortage Telangana : తెలంగాణలో పెట్రోల్, డీజిల్ సరఫరాపై సివిల్ సప్లై శాఖ కీలక ప్రకటన
- Bhatti Vikramarka: ప్రభుత్వ ఉద్యోగులకు మంత్రి 'భట్టి' భరోసా.. రూ.1000 కోట్ల బకాయిల విడుదల.!
- MLA Rajagopal Reddy: తండ్రికి విలువ ఇవ్వని మనిషి అమ్మ ఎలా అవుతుంది.!
నిన్న హైదరాబాద్లోని అత్తాపూర్లో నాసిరకం చాక్లెట్ల తయారీ వెలుగు చూసిన విషయం తెలిసిందే. ఎలాంటి అనుమతులు లేకుండా ఇళ్ల మధ్య నడుస్తున్న చాక్లెట్ల తయారీ పరిశ్రమపై ఎస్వోటీ పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో పోలీసులను సైతం ఆశ్చర్యపరిచే విషయాలు బయటపడ్డాయి. ఈ పరిశ్రమలో విష రసాయనాలు, కలుషిత నీటితో చాక్లెట్లు, లాలీపాప్లు తయారు చేస్తున్నట్లు ఎస్వోటీ పోలీసులు గుర్తించారు. వాటిని బజారులో అమ్మి సొమ్ము చేసుకోవడమే కాకుండా ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని అన్నారు. అపరిశుభ్ర వాతావరణంలో డ్రమ్ముల్లో పానకం నిల్వ ఉంచి ఆ పానకంతో చాక్లెట్లు తయారు చేస్తున్నారు. ఇలాంటి చాక్లెట్లు తింటే పిల్లల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Kotamreddy Sridhar Reddy: సీఎం జగన్కు థాంక్స్ చెప్పిన కోటంరెడ్డి.. ఎందుకంటే..?
తాజావార్తలు
-
Maulana Salman Azhar: భారత్ శత్రువులకు పాక్ గడ్డపై నూకలు చెల్లాయా? జైష్ టాప్ కమాండర్ సల్మాన్ అజార్ ఖతం!
-
Gift Tax: పెళ్లికి వచ్చే గిఫ్ట్లపై ట్యాక్స్.. నిబంధనలు మార్చిన ఐటీ శాఖ..
-
Tamilnadu Elections Exit Poll 2026: తమిళనాడులో స్టాలిన్ హవా.. చతికిలపడిన అన్నాడీఎంకే, టీవీకే..
-
Peddi: ‘టాక్సిక్’ అవుట్.. లైన్లోకి రామ్ చరణ్ ‘పెద్ది’!
-
Kerala Election Exit poll 2026: కేరళలో హస్తం హవా.. పినరయికి గుడ్ బై..
ట్రెండింగ్
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?