మంచిర్యాల జిల్లాలో సింగరేణి గనిలో మరో ప్రమాదం జరిగింది.. బుధవారం మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం శ్రీరాంపూర్ డివిజన్ ఎస్సార్పీ 3 గనిలో ఉదయం గని పైకప్పు కూలిన ఘటనలో నలుగురు కార్మికులు ప్రాణాలు విడిచిన సంగతి తెలిసిందే.. గనిలోని 21 డిప్ 24 లెవల్, 3ఎస్పీ 2 సీం వద్ద గని పైకప్పు రక్షణ చర్యలు చేపడుతున్న టింబర్మెన్ బేర లచ్చయ్య, సపోర్ట్మెన్ వీ క్రిష్ణారెడ్డి, బదిలీ వర్కర్లు గడ్డం సత్యనర్సింహారాజు, రెంక చంద్రశేఖర్ మృతిచెందారు.. పై కప్పు కూలిపోవడంతో.. బండ కింద కూరుకుపోయి అక్కడికక్కడే నలుగురు మరణించారు.. ఇక, ఇవాళ ఉదయం శ్రీరాంపూర్ ఏరియా ఆర్కే 7 గనిలో ప్రమాదం జరిగింది.. నల్లూరి సంతోష్ (ట్రామ్మర్ )కు ఈ ఘటనలో గాయాలు కాగా… రామకృష్ణాపూర్ ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.. అయితే, ఈ ప్రమాదం ఎలా జరిగింది అనే పూర్తి వివరాలు తెలియాల్స ఉంది.. కానీ, వరుస ప్రమాదాలు సింగరేణి కార్మికులను టెన్షన్ పెడుతున్నాయి.
సింగరేణిలో మరో ప్రమాదం.. శ్రీరాంపూర్ ఏరియా ఆర్కే గనిలో…
