Nizam College: మంత్రి సబితా ఇంద్రారెడ్డి కార్యాలయాన్ని ముట్టడించిన ఏబీవీపీ నాయకులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nizam College Hostel: నిజాం కళాశాల హాస్టల్ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బషీర్ బాగ్ లోని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కార్యాలయాన్ని ఏబీవీపీ నాయకులు ముట్టడించాడు. కలశాల ప్రిన్సిపాల్, ఉస్మానియా విసి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడుతున్నారు. గత 10 రోజులుగా విద్యార్థులు ఆందోళన చేస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం. విద్యాశాఖ మంత్రి వెంటనే స్పందించి విద్యార్థుల న్యాయమైన డిమాండ్ ను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ముట్టడికి ప్రయత్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. కార్యాలయం లోనికి ఏబీవీపీ నాయకులు వెళ్లేందుకు యత్నించాడంతో ఉద్రిక్తత నెలకొంది. లోనికి వెళ్లేందుకు పోలీసులు అడ్డుకోవడంతో.. ఇరువురి మధ్య తోపులాట, వాగ్వాదం చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆందోళన చేస్తున్న ఏబీవీపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. తోపులాటలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి.
Read also: భారతదేశంలోని 10 అద్భుతమైన ప్యాలెస్లు
Also Read
- OTR : పాలమూరు కాంగ్రెస్లో రచ్చ రచ్చ.. సిటీ ప్రెసిడెంట్ పదవి కోసం కుమ్ములాట!
- Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
- Off The Record : ఆకునూరి మురళి రాజీనామా వెనుక అసలు కథ ఏంటి? విద్యా కమిషన్లో ఏం జరిగింది?
- Telangana Transfers : తెలంగాణలో ఐఏఎస్, డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు..
మార్చిలో హాస్టల్ను ప్రారంభించినా.. డిగ్రీ విద్యార్థులను హాస్టల్లో చేర్చుకునేందుకు కాలేజీ యాజమాన్యం ఎందుకు అనుమతి ఇవ్వడం లేదంటూ విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. కళాశాల హాస్టళ్లలో వసతి అవసరమైన సుమారు 500 మంది విద్యార్థులు ప్రైవేట్ హాస్టళ్లలో భారీగా డబ్బులు చెల్లించాల్సి వస్తోందని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్లోనే తమకు వసతి కల్పించాలని కళాశాల అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా అస్సలు పట్టించుకోలేదని చెప్పారు. 50 శాతం యూజీ , 50 శాతం పీజీ విద్యార్థులకు హాస్టల్ సీట్లు కేటాయిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఇప్పటికైనా ఉద్యమం నిలిపివేయాలని అధికారులు కోరారు. మొత్తం తమకే కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. తమకు 100 శాతం హాస్టల్ కేటాయించే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని యూజీ విద్యార్థులు స్పష్టం చేశారు.
నిజాం కాలేజీలో కొత్తగా నిర్మించిన గర్ల్స్ హాస్టల్ బిల్డింగ్ ను యూజీ విద్యార్థినులకు కేటాయించాలంటూ కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు. మంత్రి కేటీఆర్ జోక్యంతో రంగంలోకి దిగిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో నిజాం కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ అభ్యర్థన మేరకు 10 మంది విద్యార్థినులు టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్ తో సమావేశమై సమస్యపై చర్చించారు. కానీ, చర్చలు మాత్రం సఫలం కాలేదు.
Byjus: ‘‘బైజూస్.. నీకింత బిల్డప్ అవసరమా?’’
తాజావార్తలు
-
Rahman : ‘పెద్ది’ ఆ కోరిక తీర్చింది!
-
Ram Charan: నా కెరీర్లోనే ‘పెద్ది’ నంబర్ వన్ చిత్రం
-
AP Film Corporation: ఏపీ ఫిల్మ్ కార్పొరేషన్ నూతన బోర్డు ఏర్పాటు
-
OTR : పాలమూరు కాంగ్రెస్లో రచ్చ రచ్చ.. సిటీ ప్రెసిడెంట్ పదవి కోసం కుమ్ములాట!
-
Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?