Site icon NTV Telugu

గత రెండు నెలల్లో 7 లక్షలకు పైగా కేసులు నమోదు: డీజీపీ

తెలంగాణలో కరోనా కేసులను కట్టడి చేయడానికి లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారి పై కేసులు నమోదు చేస్తున్నారు. గత రెండు నెలల్లో నమోదైన కేసుల వివరాలని హైకోర్టుకు సమర్పించారు డీజీపీ మహేందర్ రెడ్డి. బ్లాక్ మార్కెట్ పై 150 కేసులు నమోదు చేసినట్లు హైకోర్టుకు నివేదిక సమర్పించిన డీజీపీ ఏప్రిల్ 1 నుంచి మే 30 వరకు 7.49 లక్షల కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. మాస్కులు ధరించని వారిపై 4.18 లక్షల కేసులు, రూ.35.81 కోట్ల జరిమానా విధించాము. భౌతిక దూరం పాటించనందుకు 41,872 కేసులు, జనం గుమిగుడినందుకు 13,867 కేసులు, లాక్ డౌన్, కర్ఫ్యూ నిబంధనల ఉల్లంఘనలపై 2.61 లక్షల కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. అలాగే లాక్ డౌన్ ను నిబంధనల మేరకు కఠినంగా అమలు చేస్తున్నాం అని డీజీపీ తెలిపారు.

Exit mobile version