విశ్వవ్యాప్తంగా యాపిల్ ఫోన్ అత్యంత విలువైనదని అందరికీ తెలుసు. ఎక్కువగా అమ్ముడయ్యే బ్రాండ్ కూడా అదే. అయితే, యాపిల్ సంస్థ తన ఉత్పత్తి కేంద్రాలను చైనా నుంచి ఇతర దేశాలకు విస్తరిస్తోంది. చైనాకు బదులు ఇండియాలో తమ ప్రొడక్ట్ల తయారీని పెంచాలని భావిస్తోంది. కొన్ని నెలల కిందట లేటెస్ట్ మోడల్ అయిన ఐఫోన్ 13 సిరీస్ను కూడా ఇండియాలో తయారు చేయడం ప్రారంభించింది. ఇక్కడి నుంచే ఎగుమతులు పెంచుతోంది. యాపిల్ ప్రొడక్ట్లు కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరర్ల ద్వారా తయారవుతాయి
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా మొబైల్ ఫోన్ల తయారీపై ప్రభావం పడింది. కోవిడ్ కి కేరాఫ్ అడ్రస్ అయిన చైనా అమలు చేస్తున్న జీరో కొవిడ్ పాలసీతో కంపెనీ సేల్స్, ప్రొడక్షన్ బాగా తగ్గాయి. ప్రస్తుత క్వార్టర్లో 8 బిలియన్ డాలర్ల విలువైన సేల్స్ తగ్గుతాయని యాపిల్ కిందటి నెలలో ప్రకటించింది. . పవర్ కొరత వలన కిందటేడాది కూడా యాపిల్ ప్రొడక్షన్లో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఉక్రెయిన్–రష్యా యుద్ధంలో రష్యాకు చైనా మద్ధతిస్తోందనే ఆరోపణలు కూడా వెస్ట్రన్ కంపెనీలకు కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇందుకోసమే తమ ప్రొడక్షన్ కెపాసిటీని చైనాకు వెలుపల ఇండియా, వియత్నాం వంటి దేశాలకు విస్తరించాలని యాపిల్ చూస్తోంది.
గ్లోబల్ సేల్స్ లో ఐఫోన్లు మందున్నాయి. ఐఫోన్లలో 3.1 శాతం ఇండియాలోనే తయారవుతున్న సంగతి తెలిసిందే. ఈవాటాను ఈ ఏడాది 6–7 శాతానికి పెంచుకోవాలని యాపిల్ చూస్తోందని నిపుణులు చెబుతున్నారు. మిగతా దేశాలతో పోలిస్తే ఇండియాలో ప్రొడక్షన్ కాస్ట్ తక్కువగా వుంటుంది. యాపిల్ కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరర్లయిన ఫాక్స్కాన్, విస్ట్రన్ కార్పొరేషన్లు ఇండియాలో తమ ప్లాంట్లను ఏర్పాటు చేశాయి. వీటిని విస్తరిస్తున్నాయి. దీంతో ఖర్చు కూడా తగ్గుతోందని అవి చెబుతున్నాయి. రానున్న కాలంలో యాపిల్ ఫోన్లు మరింత అందుబాటులోకి రావాలంటే ఇండియా, వియత్నాం వంటి దేశాలే బెటరని యాపిల్ సంస్థ భావిస్తోంది.
Oppo Pad Air : లుక్కు అదుర్స్.. ధర కూడా తక్కువే…