AI Education: ఏఐ పిల్లల మెదడుకే ముప్పు.. నిపుణులు ఏం చెబుతున్నారంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AI students education: కాలం మారింది. ఇప్పుడు గణితం లేదా సైన్స్లోని ప్రశ్నలను ఛేదించడానికి గంటల తరబడి ఆలోచించాల్సిన అవసరం లేదు. చరిత్రను బట్టిపట్టాల్సిన పని లేదు. హోంవర్క్ గురించి తల్లిదండ్రులతో పిల్లల వాదనలు లేవు. ఇది ఏఐ యుగం. విదేశీ భాషా పాఠాన్ని అర్థం చేసుకోవడంలో అయినా, ఏ సమాచారాన్ని నేర్చుకోవడంలో అయినా పిల్లలకు చాలా ఈజీ. ఎందుకంటే పిల్లల చేతిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అనే అతిపెద్ద ఆయుధం ఉంది. కానీ.. ఏఐపై అనేక అనుమానాలూ ఉన్నాయి. ఈ ఆయుధం విద్యార్థుల సహజ మేధస్సుకు ముప్పు కలిగిస్తుందా లేదా అనే అంశంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇటీవలి సేకరించిన ప్రపంచ డేటా, నిపుణుల అభిప్రాయాలు ఓ కొత్త చర్చను రేకెత్తించాయి. ఈ అంశంపై పూర్తి వివరాలను తెలుసుకుందాం..
READ MORE: Shocking: 9వ తరగతి బాలుడిపై స్నేహితుడి వదిన అత్యాచారం.. ఫోటోలతో బ్లాక్మెయిల్..
Also Read
- రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
- కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
- 144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
- Redmi K100: 200MP కెమెరాతో రెడ్మీ K100 చవకైన స్మార్ట్ఫోన్.. 10,000mAh బ్యాటరీ!
గ్యాలప్, కాలిఫోర్నియా స్టేట్ యూనివర్శిటీ నిర్వహించిన తాజా అధ్యయనం ప్రకారం.. దాదాపు 57% మంది విద్యార్థులు ప్రతి వారం ఏఐ టూల్స్ను ఉపయోగిస్తున్నారు. యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా వంటి విదేశీ విద్యా సంస్థలు రియల్ టైమ్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ వంటి పనుల కోసం దీనిని విజయవంతంగా వాడుతున్నాయి. కానీ, ఈ సౌలభ్యం వెనుక ఉన్న ప్రమాదాలను నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ఏఐ వాడకం వల్ల ముఖ్యంగా విమర్శనాత్మక ఆలోచనా శక్తి (Critical Thinking) క్షీణించి పోతుందట. విద్యార్థులు తమ హోంవర్క్ లేదా వ్యాసాల కోసం ఏఐ మీద ఆధారపడటం వల్ల, సొంతంగా ఆలోచించే, విశ్లేషించే సామర్థ్యాన్ని కోల్పోతున్నారట. దీనిని నిపుణులు ‘కాగ్నిటివ్ ఆఫ్లోడింగ్’ అని పిలుస్తున్నారు. అంతేకాదు.. ఏఐ కొన్నిసార్లు తప్పుడు సమాచారాన్ని సైతం ఎంతో నమ్మకంగా చెబుతుంది. విద్యార్థులు దానిని గుడ్డిగా నమ్మడం వల్ల తప్పుడు జ్ఞానాన్ని పొందే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఏఐ సహాయంతో డిగ్రీలు సాధించినా, రేపు పని ప్రదేశంలో (Workplace) సొంతంగా నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఈ తరం విద్యార్థులు విఫలమయ్యే అవకాశం ఉందట.
మరోవైపు.. కొందరు నిపుణులు మాత్రం ఏఐని సమర్థిస్తున్నారు. ఏఐని సరిగ్గా ఉపయోగిస్తే విద్యార్థులు మరింత తెలివిగా మారుతారని కొందరు నిపుణులు వాదిస్తున్నారు. కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా, ప్రపంచంలోని అపారమైన జ్ఞానాన్ని ఏఐ ద్వారా విద్యార్థులు పొందగలుగుతున్నారట. ఇది వారిలో అన్వేషణా తత్వాన్ని పెంచుతుందే తప్ప, వారిని సోమరిపోతులుగా మార్చదని వీరి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు వాదనలు పరిశీలించి మనం ఓ మనం నిర్ణయానికి రావాలి. ఏఐ అనేది ఒక ‘అసిస్టెంట్’ (సహాయకుడి)లా మాత్రమే ఉండాలి తప్ప, ‘మెదడు’కు ప్రత్యామ్నాయం కాకూడదు. విద్యా సంస్థలు ఏఐ వినియోగంపై స్పష్టమైన మార్గదర్శకాలను రూపొందించాల్సిన అవసరం ఉంది. సాంకేతికతను వాడుకుంటూనే, మానవ మేధస్సును పదును పెట్టుకున్నప్పుడే ఈ తరం భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కోగలదు.
తాజావార్తలు
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
-
RR Vs LSG: మార్ష్ వీర విహారం.. రాజస్థాన్ రాయల్స్ ముందు భారీ టార్గెట్..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!