బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు పీవీఎన్ మాధవ్... విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నా కంటే ముందు అధ్యక్షులైన వారి శక్తి యుక్తులతో ముందుకు వెళ్తాను అన్నారు.. ప్రతీ కార్యకర్త తానే అధ్యక్షుడయ్యానని అన్నంతగా పని చేస్తున్నారు.. రాష్ట్రంలో అరాచక పాలనకు చరమగీతం పలుకుతూ ఒక నిర్ణయాన్నిచ్చారని పేర్కొన్నారు.. బీజేపీ ఇచ్చిన ఈ పదవిని గౌరవంగా భావించి పని చేస్తాను అన్నారు..
తెలుగు సాహితీ క్షేత్రాన్ని తన రచనలతో సుసంపన్నం చేశారు కవిస్రమాట్ విశ్వనాథ సత్యనారాయణ. కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ బిరుదుతో సత్కరిస్తే, సాహితీ రంగం ఆయనను జ్ఞానపీఠంపై కూర్చోపెట్టింది. 1895లో జన్మించి, 1976లో కన్నుమూసిన విశ్వనాథ సత్యనారాయణను ఈ తరం సాహితీ కారులూ నిత్య స్మరిస్తుంటారంటే ఆయన రచనల ప్రభావం ఎలాంటిదో అర్థమైపోతుంది. తెలుగు సాహితీ రంగంలో విశ్వనాధ స్పృశించని ప్రక్రియ లేదంటే అతిశయోక్తి కాదు. అలాంటి కవిసమ్రాట్ జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేశారు ప్రముఖ నటుడు,…