Vijayapura Aircraft Crash: కర్ణాటకలోని విజయపుర జిల్లాలో రెడ్ బర్డ్ ప్రైవేట్ జెట్ విమానం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదం మంగళూరు గ్రామం సమీపంలో చోటుచేసుకుంది. ఈ ఘోర ప్రమాదంలో పైలట్, ట్రైనీ పైలట్ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన అనంతరం స్థానిక పోలీసులు మాట్లాడుతూ.. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోందని, దర్యాప్తు పూర్తయిన తర్వాత అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. READ ALSO: Warangal Rocket Launch : తొలిసారి…