ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ మధ్య జరిగిన శాంతి చర్చలు విఫలమయ్యాయి. 21 గంటల పాటు జరిగిన చర్చలు ఎలాంటి సత్ఫలితాన్ని ఇవ్వకుండా అర్ధాంతరంగా ముగిసిపోయాయి.
అమెరికా-ఇరాన్ మధ్య మరోసారి చర్చలు జరగబోతున్నట్లుగా అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. గురువారం కొత్త విడత చర్చలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని అమెరికా అధికారులను ఉద్దేసిస్తూ కథనాలు వస్తున్నాయి.