మన దేశంలో భక్తులు ఎక్కువ.. దేవుడు అంటే భక్తి ఎక్కువ అందుకే వీధికి ఒక గుడి దర్శనం ఇస్తుంది.. అంతేకాదు ఇండియా లో ఆంజనేయ స్వామికి భక్తులు ఎక్కువగా ఉంటారు.. ఆయనను భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల భక్తులకు ధైర్యాన్ని ఇవ్వడంతో పాటు కష్టాలను గట్టెక్కిస్తాడని నమ్మకం..హనుమంతుడికి ఇష్టమైన వాటిలో తమలపాకులు అలాగే సింధూరం కూడా ఒకటి. హనుమాన్ ని పూజించేందుకు సింధూరాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. కేసరి రంగులో ఉండే సింధూరం సమర్పించడం ద్వారా సకల కోరికలు నెరవేరుతాయట.…