దేవుడి పూజకు ఎక్కడైనా వివిధ రకాల పూవులు దొరుకుతాయి. కానీ తిరుమల తిరుపతి దేవస్థానం ఆధీనంలో ఉన్న కీలపట్ల కోనేటిరాయస్వామికి పుష్పాలు కరువు అయ్యాయి. పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలం కీలపట్ల శ్రీ కోనేటిరాయస్వామి వారి ఆలయాన్ని దర్శించుకున్నారు హిందూ పరిరక్షణ సమితి సభ్యులు. అక్కడ పుష్పాలంకరణ లేని కారణంగా అదేంటని అక్కడి అధికారులను వివరణ కోరగా,, గత కొన్ని నెలలుగా టిటిడి వారు పుష్పాలను సరఫరా ఆపేశారని తెలియజేశారు. హిందువుల మనోభావాలు ఎక్కడా కూడా దెబ్బతినే…
తిరుమలలో వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనం పునరుద్దరించలేదని టీటీడీ తెలిపింది. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో 2020, మార్చి 20వ తేదీ నుంచి వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనాలను నిలిపివేశారు టీటీడీ అధికారులు. ఇప్పటికి కూడా కోవిడ్ పూర్తి అదుపులోకి రానందువల్ల వీరి దర్శనాల విషయంలో ఇదే స్థితి కొనసాగుతోంది. అయితే గత కొన్ని రోజులుగా సామాజిక మాధ్యమాల్లో తిరుమలలో వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనాలు పునరుద్ధరించినట్టు అవాస్తవ సమాచారం…