తెలంగాణ విద్యార్థులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో విద్యార్థినుల కోసం ప్రత్యేక బస్సులు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ అన్నారు. ఈ అవకాసం జూన్ నుంచి హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని విద్యాసంస్థల్లో చదివే విద్యార్థుల సౌకర్యార్థం 100 అదనపు ట్రిప్పులు ఏర్పాటు చేస్తామని తెలిపారు.