కరోనా భయం తొలగిపోలేదు. తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా పట్ల రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా వుండాలని, స్వీయ నియంత్రణాచర్యలను చేపట్టాలని, ప్రభుత్వ నిబంధనలు పాటించాలని, భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో కరోనా పరిస్తితి వైద్యారోగ్యశాఖ అప్రమత్తత పై ప్రగతి భవన్ లో ఆదివారం సిఎం కెసిఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆరోగ్యశాఖతో పాటు ఇదే సందర్భంలో రోడ్లు భవనాలు , ఇరిగేషన్…
వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీని కరోనా మహమ్మారి వదలడం లేదు. తాజాగా మరో ఐదుగురు మెడికోలు కరోనా బారినపడ్డారు. నిన్న 17 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఇవాళ మరోసారి పరీక్షలు నిర్వహించగా మరో ఐదుగురికి పాజిటివ్ అని తేలింది. దీంతో కేఎంసీలో మొత్తం 22 మంది మెడికల్ విద్యార్థులు కరోనాకు గురయ్యారు. కరోనా అలజడితో అటు విద్యార్ధులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు ఆందోళనకు గురవుతున్నారు. దీంతో అప్రమత్తమైన నిట్ అధికారులు. ఇదిలా వుంటే నిట్ లోనూ కరోనా…