China: డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేసేలా నిర్ణయం తీసుకున్నారు. చైనా నుంచి దిగుమతి చేసుకునే అన్ని వస్తువులపై 100% సుంకాన్ని ప్రకటించారు. నవంబర్ 1, 2025 నుంచి ఈ కొత్త సుంకాలు అమల్లోకి వస్తాయని తెలిపారు. ఈ నిర్ణయంతో యూఎస్-చైనా మధ్య పెద్ద వాణిజ్య యుద్ధం జరిగే సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే.. ఈ ప్రకటనపై డ్రాగెన్ స్పందించింది. ట్రంప్ సుంకాలను ఏకపక్షంగా అభివర్ణిస్తూ, ప్రతీకార చర్యలకు బలమైన హెచ్చరిక జారీ చేసింది.