నిర్మాణంలో ఉన్న గోడ కూలి ఇద్దరు అక్కడికక్కడే మృతి కూటి కోసం, కూలీ కోసం రాష్ట్రానికి వచ్చిన ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. గోడ కూలి ఇద్దరు మరణించారు. దీంతో వారి కుటుంబాలు దిక్కులేనివయ్యాయి. అనంతపురం జిల్లా కూడేరు మండలం గొటుకూరు దగ్గర నిర్మాణంలో ఉన్న గోడ కూలి ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో మరో ముగ్గురికి గాయాలు కాగా.. వారిని ఆస్పత్రికి తరలించారు. ఆర్చ్ నిర్మాణం కోసం పిల్లర్లు వేస్తుండగా ఒక్కసారిగా కప్పు…
రామ మందిర్ నిర్మాణ జాప్యానికి బీజేపీనే కారణం.. రామ మందిర్ నిర్మాణ జాప్యానికి బీజేపీనే కారణమని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. మోడీ ప్రధాని హోదాలో ఉండి మత విద్వేషాలను రెచ్చగొడు తున్నారన్నారు. స్వార్ధ రాజకీయాలకోసం మీరు దేశాన్ని ఎటు వైపు తీసుకపోవాలని అనుకుంటున్నారు మోడీ అన్నారు. ఆర్టీసీ బస్ లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని మోడీ తప్పు పడుతున్నారన్నారు. మహిళల పట్ల మోడీకి ఉన్న వివక్షత అర్ధమౌతుందన్నారు. మోడీ ముస్లిం రిజర్వేషన్ల విషయంలో ద్వంద వైఖరి…
మే 20 నుంచి జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీఎస్ టెట్) 2024కు హాజరయ్యే అభ్యర్థులను పరీక్ష ప్రారంభానికి 15 నిమిషాల ముందు కేంద్రాల్లోకి అనుమతించరు. ఉదయం సెషన్ పరీక్ష కోసం, అభ్యర్థులను ఉదయం 7.30 నుండి సెంటర్లలోకి అనుమతిస్తారు మరియు 8.45 గంటలకు గేట్ మూసివేయబడుతుంది. మధ్యాహ్నం సెషన్కు, అభ్యర్థులను మధ్యాహ్నం 12.30 గంటల నుంచి అనుమతిస్తారు మరియు గేట్ మధ్యాహ్నం 1.45 గంటలకు మూసివేయబడుతుంది. పరీక్ష పూర్తయ్యే వరకు అభ్యర్థులను బయటకు…
ఇదంతా బీజేపీ కుట్ర.. స్వాతి మలివాల్ కేసుపై ఆప్.. ఆప్ నేత, రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ వ్యవహారం దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది. సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో ఆయన పీఏ బిభవ్ కుమార్ స్వాతి మలివాల్పై దాడి చేశాడు. దీనిపై ఇప్పటికే ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తనను బిభవ్ ఏడు సార్లు చెంపపై కొట్టడమే కాకుండా, సున్నిత భాగాలపై కడుపులో తన్నాడని ఆమె ఆరోపించింది. ఈ రోజు ఢిల్లీ పోలీసులు, ఫోరెన్సిక్…
భర్త, అత్తపై కోడలు అరాచకం.. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం దాడి అత్తలేని కోడలు ఉత్తమురాలు.. కోడలు లేని అత్త గుణవంతురాలు అనేది సామెత.. అంటే వీరిలో ఎవరో ఒకరు మాత్రం ఇంట్లో ఉంటేనే బాగుంటుంది. లేదంటే రచ్చ రంబోలానే.. గతంలో అత్త, భర్త హవా నడిచేది. భర్త, అత్త కూర్చోమంటే కూర్చునేవారు.. నిలబడమంటే నిలబడేవారు.. అలా హుకుం జారీ చూస్తూ వారి పెత్తనాలు సాగుతుండేవి. అలా అని గడసరి కోడళ్లు కూడా లేకపోలేదండోయ్. అత్త, భర్త ప్రవర్తన,…
దిష్టిబొమ్మ గురించి మనందరికీ తెలిసిందే. షాపులో, ఇంటిముందు దీన్ని చూసే ఉంటారు. అయితే.. కర్ణాటకలోని బెంగళూరులో ఓ ఫోటో తెగ వైరల్గా మారింది. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఆవిష్కరణలు కూడా పెరుగుతున్నాయి. చాలా దృశ్యాలు , వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వన్ టు వన్.. వేల మంది వీక్షించే విషయాన్ని ఒక్కరు తెలుసుకుని షేర్ చేస్తున్నారు. ఫోటోలు, వీడియోలు, డ్యాన్స్, డైలాగ్, టాలెంట్ షో, సీరియస్, ఫన్నీ, ఏదైనా షేర్ చేయండి. సామాన్యులు ఆసక్తిగా…
యూపీలో వైద్యుడి నిర్లక్ష్యం.. ఆపరేషన్ చేసి కడుపులో దూది మర్చిపోయిన డాక్టర్ వైద్యులు శస్త్రచికిత్స చేసేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఏమాత్రం నిర్లక్ష్యం వహించిన ప్రాణాలు గాల్లో కలిసిపోయే ప్రమాదం ఉంటుంది. కొంత మంది వైద్యులు ఆపరేషన్ చేసేటప్పుడు నిర్లక్ష్యంగా ఉండి కడుపులో శస్త్రచికిత్స సమయంలో ఉపయోగించే పలు వస్తువులు మర్చిపోతుంటారు. తాజాగా యూపీలో ఇలాంటి ఉదాంతం వెలుగులోకి వచ్చింది. ఉత్తర్ప్రదేశ్లోని మేరఠ్లో ఓ వైద్యుడు చేసిన నిర్వాకం రోగి ప్రాణాల మీదకు తెచ్చింది. పిత్తాశయంలో అనారోగ్యంతో…
పవన్ కల్యాణ్కు ప్రేమతో ఓటేశారు: నాగబాబు జనసేన అధినేత పవన్ కల్యాణ్కు ఓటర్లంతా ప్రేమతో ఓటేశారని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు అన్నారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేయడంపై ప్రకటన వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకూ అలుపెరుగని పోరాట పటిమ చూపిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. పవన్ అభ్యర్థిత్వాన్ని బలపరిచేందుకు కృషి చేసి వారి సేవలు గుర్తిస్తామని నాగబాబు స్పష్టం చేశారు. కూటమి అభ్యర్థిగా పిఠాపురం నుంచి పవన్ ఎమ్మెల్యేగా…
తెలంగాణలో మరో మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. హైదరాబాద్లో నేడు, రేపు జల్లులు పడే అవకాశం. ప్రధాని మోడీ నేడు యూపీలోని వారణాసి లోక్సభ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేయనున్నారు. అట్టహాసంగా జరిగే ఈ కార్యక్రమంలో బీజేపీ పాలిత, మిత్రపక్షాల రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, సీనియర్ నాయకులు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. విశాఖ…
ప్రజ్వల్ కేసులో కర్ణాటక హోంమంత్రి కీలక సూచనలు సార్వత్రిక ఎన్నికల వేళ కర్ణాటక రాజకీయాలను ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపుల వ్యవహారం కుదిపేసింది. కర్ణాటక రాష్ట్రాన్నే కాకుండా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించిన వీడియోలు బయటకు రాగానే.. దర్యాప్తు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఈ వ్యవహారం బయటకు పడగానే ప్రజ్వల్ విదేశాలకు పారిపోయారు. సిట్ లుకౌట్ నోటీసులు కూడా ఇచ్చింది. తాజాగా ఈ వ్యవహారంపై రాజకీయ పార్టీలు, నేతలకు…