Sree Vishnu: టాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న యువ హీరో శ్రీవిష్ణు. ప్రస్తుతం హీరో శ్రీవిష్ణు ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఆయన నటించిన రెండు వేర్వేరు చిత్రాలు కేవలం 24 గంటల వ్యవధిలోనే థియేటర్లోకి రాబోతున్నాయి. ఫిబ్రవరి 27న శ్రీవిష్ణు హీరోగా నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘మృత్యుంజయ’ రిలీజ్ కానుండగా, ఆ తర్వాతి రోజే ఫిబ్రవరి 28న ఆయన హీరోగా తెరకెక్కిన ‘విష్ణు విన్యాసం’ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.…