తాజాగా నటుడు రాజేంద్ర ప్రసాద్ మరోసారి నోరు జారిన సంగతి అందరికీ తెలిసిందే. ఆయనకు కొద్దిరోజుల క్రితం కాంతారావు అవార్డు ప్రకటించారు. ఆ అవార్డు అందుకుంటున్న సమయంలో కాంతారావును పొగుడుతూ, తమిళనాడు మాజీ సీఎం, అక్కడ అత్యంత జనాదరణ కలిగిన నటుడు ఎం.జి.ఆర్. ను ఆయన విమర్శించారు. కాంతారావును చూసి ఆయన భయపడిపోయేవారు అని అర్థం వచ్చేలా కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ విషయం మీద అక్కడి నటీనటులు సీరియస్ అవుతున్నారు. తాజాగా విషయాలు…
77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రభుత్వం పద్మ అవార్డు గ్రహీతల పేర్లు విడుదల చేయగా నటకిరీటి రాజేంద్రప్రసాద్ కి పద్మ శ్రీ లభించింది. తనకు పద్మశ్రీ అవార్డు రావడంతో రాజేంద్రప్రసాద్ స్పందించారు “నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారం. ఈ రోజు నా జీవితంలో ఎంతో సంతోషకరమైన రోజు. భారత ప్రభుత్వం నాకు పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది అని తెలిసినప్పటినుండి నా కళ్ళు ఆనందంతో నిండిపోయాయి. ఒక నటుడిని గుర్తించి ఇంతటి గొప్ప గౌరవాన్ని…
తెలుగు చిత్రసీమ నవ్వుల నావలో పకపకలు పండించిన వారు ఎందరో ఉన్నారు. అయితే కథానాయకునిగా అధిక సంఖ్యలో నవ్వుల పువ్వులు పూయించిన మేటి నటకిరీటి రాజేంద్రప్రసాద్! ఒకప్పుడు హీరోగా కితకితలు పెట్టిన రాజేంద్రప్రసాద్ ప్రస్తుతం కేరెక్టర్ యాక్టర్ గానూ నవ్వులు పూయిస్తూనే ఉన్నారు.