తెలంగాణ రాజధాని హైదరాబాద్లో ఎప్పుడూ రద్దీగా ఉండే ఎల్బీనగర్, హయత్ నగర్ ప్రాంతాల రూపురేఖలు మార్చేలా రాష్ట్ర ప్రభుత్వం భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది. పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని.. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా రహదారుల విస్తరణ, అత్యాధునిక రవాణా వ్యవస్థల ఏర్పాటుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలో హయత్ నగర్ పరిధిలో జరిగిన అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమ విశేషాలు , మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించిన…
Kishan Reddy : తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జాతీయ రహదారి ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతూ కేంద్ర మంత్రి , బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ జి. కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఈ లేఖలో కిషన్ రెడ్డి పేర్కొన్నదేమిటంటే, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014 నుండి ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా మరో 2,500 కిలోమీటర్లకు పైగా జాతీయ రహదారులను నిర్మించిందని, ఇది రాష్ట్ర…