Kondapur Demolitions: హైదరాబాద్ నగరంలోని కొండపూర్ లో ప్రభుత్వ భూమిలో ఆక్రమణలను హైడ్రా అధికారులు తొలగించారు. దాదాపు 3600 కోట్ల రూపాయల విలవ చేసే 36 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడింది హైడ్రా.
Telangana Lightning Tragedy: పిడుగు పాటుకు ఆరుగురు మృతి చెందిన దారుణ ఘటన తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకుంది. బుధవారం నిర్మల్, జోగులాంబ గద్వాల్ జిల్లాల పరిధిలో ఆరుగురు పిడుగు పాటుకు బలయ్యారు. నిల్మల్ జిల్లా పెంబి మండలంలో గుమ్మనుయోంగ్లాపూర్లో ముగ్గురు మృతి చెందారు.
Snake Found in Curry Puff: చాలా మంది బయటి ఆహారాన్ని ఇష్టంగా తింటుంటారు. అయితే తినేది ఆహారమా.. విషమా..? అనేది ఏనాడు ఆలోచించరు. బయట తినే ఆహారం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. వాటిని ఎక్కువ కాలం నిల్వ చేసి ఫుడ్ ప్రిపేర్ చేస్తుండటంతో వాటి వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని అంటున్నారు.
Sangareddy: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి దశాబ్దం ముగిసింది. అయినా కొన్ని గ్రామాలు, ఏజెన్సీ ప్రాంతాలకు రోడ్లు లేకపోవడం మన నాయకులు చెత్త పాలనకు అద్దంపడుతోంది. గిరిజన గ్రామాల్లో సైతం రోడ్డు సౌకర్యాలు లేక ఆ గిరిజనులు పడుతున్న నరకయాతన వర్ణనాతీతం. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో అలాంటి ఓ తండా వెలుగులోకి వచ్చింది.
Yadadri Tharmal Plant : నల్లగొండ జిల్లాలోని యాదాద్రి థర్మల్ ప్లాంట్లో రాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ప్లాంట్లోని మొదటి యూనిట్లో ఈ ప్రమాదం జరిగింది. బాయిలర్ నుండి ఆయిల్ కారుతుండగా, దాని కింద వెల్డింగ్ పనులు జరుగుతుండటంతో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ఈ సమయంలో యూనిట్ ట్రయల్ రన్ కోసం సిద్ధమవుతోంది. అదృష్టవశాత్తు, ప్రాణ నష్టం జరగలేదు, కానీ ఆస్తి నష్టం సంభవించి ఉండవచ్చని భావిస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే…