తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కాంట్రాక్టు ఉద్యోగుల వేతన సవరణపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మార్చి 22న అసెంబ్లీలో ప్రకటన చేశారు. అంతేకాకుండా మే 1వ తేదీన పొందే ఏప్రిల్ నెల వేతనాలు నూతన పిఆర్సీ ప్రకారమే ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు పొందుతారని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. కానీ ఏప్రిల్ నెల ముగింపుకొచ్చినప్పటికీ ముఖ్యమంత్రి ఆదేశాలు అమలు కాలేదు సరి కదా, ఇంతవరకు కూడా పిఆర్సీ పై ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల కాలేదు. 1.07.2018…