తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. బీఆర్ఎస్, బీజేపీ, టి.కాంగ్రెస్ వరుస కార్యక్రమాలతో హాట్ హాట్ గా సమావేశాలు కొనసాగనున్నాయి. ఈనెల 18న ఖమ్మంలో సీఎం కేసీఆర్ భారీ సభకు ప్లాన్ చేస్తుంటే.. కాంగ్రెస్, బీజేపీకి చెందిన ఢిల్లీ దూతలు హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యారు.
కాంగ్రెస్ ఇంచార్జి మాణిక్కం ఠాగూర్ నేడు హైదరాబాద్ రానున్నారు. ఠాగూర్ నెల రోజుల పాటు రాష్ట్రంలోనే ఉంటారు. మునుగోడు ఉప ఎన్నిక, రాహుల్ భారత్ జోడో యాత్ర నేపథ్యంలో ఠాగూర్ రంగంలోకి దిగారు. ఇవాళ సాయంత్రం వచ్చి మూడు రోజుల తర్వాత వెళ్లి మళ్లీ నగరానికి తిరిగి రానున్నారు.