మొన్న విజయనగరం.. ఇప్పుడు రాయచోటి.. ఉగ్రమూకల కదలికలతో ఈ రెండు ప్రాంతాల్లో కలకలం రేగింది. తాజాగా ఇద్దరు ఉగ్రవాదులను తమిళనాడు ఐబీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారిద్దరినీ చెన్నైకి తరలించి విచారిస్తున్నారు. మరోవైపు రాయచోటి పోలీసులు ఆ ఇద్దరు ఉగ్రవాదుల భార్యలను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. భారీ ఎత్తున పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.