Afghanistan-Pakistan: తాలిబన్లు, పాకిస్థాన్ దళాల మధ్య మరోసారి భీకర పోరాటం జరుగుతోంది. ఆఫ్ఘస్థాన్-పాకిస్థాన్ సరిహద్దులో ఉన్న స్పిన్ బోల్డాక్లో రెండు సైన్యాలు తలబడుతున్నాయి. ఈ రోజు ఉదయం 4 గంటల సమయంలో స్పిన్ బోల్డాక్ ప్రాంతంలో పాకిస్థాన్ దళాలు, ఆఫ్ఘన్ తాలిబన్ల మధ్య భారీ పోరాటం జరిగింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.
Pak- Afghan war: ఆఫ్ఘన్ భూభాగంలో పాకిస్థాన్ వైమానిక దాడులకు తాము ప్రతీకారం తీర్చుకున్నట్లు తాలిబన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ వెల్లడించారు. ఈ ప్రతీకార దాడుల్లో కనీసం 58 మంది పాకిస్థాన్ సైనికులు మరణించారని, 30 మంది గాయపడ్డారని స్పష్టం చేశారు. పాకిస్థాన్కి చెందిన 25 ఆర్మీ పోస్టులను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. ఇటీవల పాకిస్థాన్ తమ దేశ రాజధాని కాబుల్తోపాటు ఓ మార్కెట్పై బాంబు దాడులు చేసిందని ఇందుకు ప్రతీకారంగా ఈ దాడులు జరిపినట్లు తెలిపారు.