ఈ రోజు, రేపు వివిధ సేవలకు సంబంధించిన టికెట్లను విడుదల చేయనుంది టీటీడీ.. ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో డిసెంబర్ నెలకు సంబంధించిన అంగప్రదక్షణ టోకెన్లు విడుదల చేయనున్నారు.. ఇక, ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ టిక్కెట్లు విడుదల చేయనుంది టీటీడీ.. మరోవైపు.. మధ్యహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, వికలాంగులకు సంబంధించిన దర్శన టిక్కెట్ల కోటాను విడుదల చేయనున్నారు..
శ్రీవాణి ట్రస్ట్ అంటే.. తెలియని వారుండరు. అలాంటిది.. టీటీడీకి మంచి ఆదాయ వనరుగా మారింది. ఇక శ్రీవారి భక్తులుకు కూడా ఉపయోగకరంగా వుండడంతో భక్తులు నుంచి మంచి స్పందన లభిస్తుంది. ఎలాంటి సిఫార్సు లేఖలు లేకుండా 10 వేలు రూపాయులు ట్రస్ట్ కి చెల్లిస్తే చాలు. ప్రోటోకాల్ దర్శనాన్ని భక్తులుకు కల్పిస్తుంది. దీంతో శ్రీవాణి ట్రస్ట్కి నెలకు దాదాపు 30 కోట్లు పైగానే ఆదాయం లభిస్తుంది.