Security lapse at Srisailam: ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయంలో భద్రతా వైఫల్యం వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. ఉగాది మహోత్సవాల సందర్భంగా గర్భగుడిలో శ్రీస్వామివారిని ఓ భక్తుడు సెల్ఫోన్లో వీడియో తీయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దేవాలయంలో మొబైల్ ఫోన్లు, వీడియో కెమెరాలకు అనుమతి లేకపోయినప్పటికీ, ఒక సామాన్య భక్తుడు వాటిని లోనికి తీసుకెళ్లడం భద్రతా లోపాలపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. వీడియో తీసిన వ్యక్తి కర్ణాటక రాష్ట్రానికి చెందిన భక్తుడిగా గుర్తించినట్లు సమాచారం.…