కర్ణాటకలో తీవ్ర కలకలం రేపిన జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ కేసులో ఊహించని ట్విస్ట్ నెలకొంది. జాతీయ మహిళా కమిషన్ గురువారం మాట్లాడుతూ.. ఈ కేసులో ఫిర్యాదు చేసిన మహిళల్లో ఒకరు తనను బెదిరించి రేవణ్ణపై తప్పుడు ఆరోపణలు చేయించారని తమతో చెప్పినట్లు కమిషన్ చెప్పుకొచ్చింది.
కర్ణాటక రాష్ట్రంలోని హాసన్ పార్లమెంట్ సిటింగ్ ఎంపీ, జేడీఎస్ నాయకుడు ప్రజ్వల్ రేవణ్ణపై వస్తున్న అశ్లీల పెన్డ్రైవ్ ఆరోపణలపై కర్ణాటక సర్కార్ ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్)ను ఏర్పాటు చేసింది.