Tamil Nadu: తమిళనాడులో ఓ విద్యార్థిని సంచలనం సృష్టించింది. సాధారణ మధ్య తరగతి కుటుంబం నేపథ్యం, కార్పెంటర్ కూతురు ప్లస్ టూలో మెరుగైన ప్రతిభ కనబరిచింది. ఏకంగా తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రశంసలు అందుకుంది. హయ్యర్ సెకండరీ పరీక్షల్లో 12వ తరగతి దిండిగల్ విద్యార్థిని ఎస్ నందిని ఏకంగా 600కు 600 మార్కులు సాధించింది. ప్రభుత్వ పరీక్షల డైరెక్టరేట్ (డీజీఈ) సోమవారం వెల్లడించిన ఫలితాల్లో నందిని 600/600 స్కోర్ సాధించింది.