వైఎస్సార్ కడప జిల్లాలో ఆర్టీసీ ప్రయాణికులు తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. వేంపల్లి మండల పరిధిలోని వీరన్నగట్టుపల్లె సమీపంలో ఆదివారం ఒక పల్లెవెలుగు బస్సు ప్రమాదానికి గురైంది. ప్రయాణికులతో వెళ్తున్న ఈ బస్సు ఒక్కసారిగా అగ్నిప్రమాదానికి గురవ్వడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. అసలేం జరిగింది.. ? స్థానిక సమాచారం ప్రకారం.. వీరన్నగట్టుపల్లె వద్ద అప్రోచ్ రోడ్డు పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రోడ్డుపై మట్టిని ఎక్కువగా ఎత్తుగా పోయడంతో.. రోడ్డు పైనుంచి వెళ్తున్న హైటెన్షన్…