కరోనా సెకండ్ వేవ్ కారణంగా విడుదలలో జాప్యం జరిగిన ‘రిపబ్లిక్’ మూవీ, గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 1న జనం ముందుకొచ్చింది. ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై కోమాలోకి వెళ్ళి బయటకు వచ్చిన సాయితేజ్ నటించిన ఈ సినిమా గురించి మెగాభిమానులు ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. అంతేకాదు… ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ఇటు సినిమారంగంలో అటు రాజకీయ రంగంలో ప్రకంపనలు సృష్టించాయి. దాంతో సినీ, రాజకీయ ప్రముఖుల దృష్టి…
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా దేవాకట్టా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘రిపబ్లిక్’. రేపు ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ఫస్ట్ రివ్యూ అప్పుడే వచ్చేసింది. నేచురల్ స్టార్ నాని సినిమాను చూసేసాను అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సినిమాపై తన అభిప్రాయం ఏంటో కూడా ఇందులో వెల్లడించాడు. “రిపబ్లిక్ చూసాను… సాయి ధరమ్ తేజ్ తన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిపై దయ చూపించాడు. అది మీ ప్రార్థనల రూపంలో తిరిగొచ్చింది.…