భారత్-పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దుల్లో నిత్యం కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది పాక్.. ఆ దేశ సైన్యం కవ్వింపు చర్యలకు పాల్పడడం.. అదే సమయంలో ఉగ్రవాదులు చొరబడడం లాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.. అయితే, ఎప్పటికప్పుడు వాటిని తిప్పికొడుతూనే వస్తోంది ఇండియన్ ఆర్మీ.. అయితే, పాక్ నుంచి డ్రోన్ల చొరబాటును ఇవాళ గట్టిగా నిలదీసింది భారత్.. సరిహద్దు ఉల్లంఘనలను నియంత్రించాలని సూచించింది. భారత్, పాక్ అంతర్జాతీయ సరిహద్దులోని ఆక్ట్రాయ్ వద్ద బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్), పాకిస్థాన్ రేంజర్స్…