దర్శకధీరుడు S. S. Rajamouli తన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ వారణాసి రిలీజ్ ప్లానింగ్ విషయంలో అసంతృప్తిగా ఉన్నారనే వార్తలు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. మొదటగా ఈ చిత్రాన్ని బాలీవుడ్ లో తెరెకెక్కుతున్న రామాయణ కంటే ముందుగా విడుదల చేయాలనే అనుకున్నారట. అయితే రామాయణం ఇప్పటికే రెండు భాగాలుగా 2026, 2027 దీపావళి సీజన్లను లాక్ చేసుకోవడంతో, దానికి దాదాపు ఆరు నెలల గ్యాప్ ఉంచి వరణాసిని విడుదల చేయాలని రాజమౌళి టీమ్ ప్లాన్ చేసినట్లు టాక్.…