పండుగల కోసం ఇంటికి వెళ్తున్న ప్రయాణికులకు భారతీయ రైల్వే శుభవార్త చెప్పింది. పండుగల సీజన్ సమీపిస్తున్న తరుణంలో.. దుర్గాపూజ, దీపావళి, ఛత్ పండుగల కోసం ప్రయాణికులు తమ సొంత గ్రామాలకు వెళ్తారు. ఈ క్రమంలో.. భారతీయ రైల్వే దాదాపు 6,000 ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. అంతేకాకుండా.. 108 రైళ్లకు అదనపు జనరల్ కోచ్లు జత చేశారు. పండుగల సమయంలో కనిపించే అదనపు రద్దీని తగ్గించడానికి 12,500 కోచ్లను మంజూరు చేసినట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్…